ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు, ఈ జిల్లాలపై ప్రభావం - తాజా అలర్ట్స్..!!
వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. మొంథా బీభత్సాన్ని మరువక ముందే మరో తుఫాను అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. మరింత బలపడే అవకాశం ఉన్నదని, వాయుగుండంగా బలపడనుందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో 15 నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం/ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్గా మారుతుందని వెల్లడించారు. కాగా, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనావేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీని కంటే ముందుగా మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్టు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసి, ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారి తెలిపారు.

కాగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది. దక్షిణ భారతం పైకి చలిగాలులు వీస్తుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. పాడేరు ఏజెన్సీ, తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్యకోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయినట్లు వెల్లడించారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడ లో 14.7, పెదబయలులో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల లోపు నమోదు అవుతున్నాయి. ఇక.. రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావం రాష్ట్రం పై పెద్దగా ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నా.. వర్షాలు మాత్రం కురుస్తాయని చెబుతున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications