దారుణం: మతిస్థిమితం లేని మహిళపై రేప్
విశాఖపట్నం: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగర పరిధిలో ఉన్న కోస్టల్ బ్యాటరీ సమీపంలో ఓ మతిస్థిమితం లేని మహిళపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఆ మహిళ కేకలు వేయడంతో కొందరు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
దీంతో దుండగుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. విశాఖ వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అత్యాచారానికి గురైన మహిళను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మితిస్థిమితం లేని మహిళ ఎక్కడి నుంచి వచ్చింది? అత్యాచారం చేసిన గుర్తుతెలియని వ్యక్తి ఎవరనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వెంకటాపురం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం వెంకటాపురంలో వేగంగా వస్తున్న ఓ లారీ తూఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారు. ముగ్గురు మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలం వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.