అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర సంబంధం?: రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీచర్ దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లాలోని హిందూపురం మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ, పురుషుడు దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధమే ఈ రెండు హత్యలకు కారణమని అనుమానిస్తున్నారు.

స్థానిక బీసీ సంఘం అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణ స్వామితో పాటు ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కల్పనను దుండగులు దారుణంగా నరికి చంపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం... హిందూపురం సమీపంలోని బెవనహళ్లి వద్ద నారాయణ స్వామి ఓ హౌసింగ్ వెంచర్ వేశారు. తన ఇన్నోవా వాహనంలో కల్పనతో కలసి నారాయణ స్వామి ఆదివారం ఆ వెంచర్ వద్దకు వెళ్లారు.

A woman and man murdered in Anantapur district

దుండగులు అక్కడే వారిద్దరిని బండరాళ్లతో కొట్టి కత్తులతో నరికి చంపారు. అనంతరం నారాయణస్వామి వాహనంలోనే పరారయ్యారు. మంగళవారం వెంచర్ వద్ద మృతదేహాలను ఓ గొర్రెల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే వీరిద్దరి హత్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు.

వ్యక్తిపై కత్తితో దాడి: రూ.6.50లక్షల అపహరణ

కర్నూలు జిల్లాలోని బేతంచర్ల మండలం గోర్లగుట్టలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. లక్ష్మీకాంత్‌ రెడ్డి అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.6.50 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman and man murdered in Anantapur district on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X