విశాఖ, విజయవాడ ప్రయాణికులకు హెచ్చరిక.. పలు రైళ్ళ రద్దు, దారి మళ్ళింపులు!!

విశాఖపట్నం విజయవాడ డివిజన్లోని న్యూ వెస్ట్ భీమవరం మరియు విజయవాడ మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం జంక్షన్ నుండి కొన్ని రైళ్ళను ఆరు రోజులపాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంతేకాదు మరికొన్ని రైళ్ళను దారి మళ్ళిస్తున్నట్టు పేర్కొంది.

విశాఖ జంక్షన్ నుండి రైళ్ళ రద్దు
మూడవ రైల్వే లైన్ పనుల కారణంగా విశాఖపట్నం నుండి కడప వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్, ఆగస్టు 5వ తేదీ నుండి పదవ తేదీ వరకు కడప నుండి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ ఆరవ తేదీ నుండి 11వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఒక రైళ్ళ దారి మళ్లింపు వివరాలలోకి వెళితే మొత్తం ఏడు జతల రైళ్ళను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్ళించినట్టు పేర్కొంది.

Alert to Visakhapatnam and Vijayawada passengers some trains canceled and many trains diverted

ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
విశాఖపట్నం నుండి న్యూఢిల్లీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ నిడదవోలు, గుడివాడ, రాయనపాడు మీదుగా ప్రయాణం చేస్తుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ స్టాప్లను తాకకుండా ఈ రైలు మళ్లింపు కొనసాగుతుంది. రామవరప్పాడు తాత్కాలిక స్టాప్. న్యూఢిల్లీ నుండి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి వచ్చే రైలు కూడా ఇదే మళ్లించిన మార్గంలో నడవనుంది. రెండవ తేదీ నుండి పదవ తేదీ వరకు ఈ రైళ్ల దారి మళ్ళింపు కొనసాగుతుంది.

గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
విశాఖపట్నం నుండి హైదరాబాద్ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏలూరు విజయవాడ మీదుగా నడుస్తుంది కానీ రైల్వే లైన్ కమిషన్ పనుల నేపథ్యంలో నిడదవోలు గుడివాడ రాయనపాడు మీదుగా రామవరప్పాడు స్టాప్ లో ఆగి తిరిగి కొనసాగుతుంది. మూడవ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఈ రైలు దారి మళ్లింపు కొనసాగుతుంది.

లోకమాన్య తిలక్ ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు
ఇక విశాఖపట్నం నుండి లోకమాన్య తిలక్ ఎల్టిటి ఎక్స్ప్రెస్ రామవరప్పాడు విజయవాడ రాయలపాడు మీదుగా ప్రయాణం చేయాల్సి ఉండగా ఇది రామవరప్పాడు రాయలపాడు మీదుగా వెళుతుంది. విజయవాడ స్టేషన్ ను ఇది దాటవేసి నడుస్తుంది తాత్కాలికంగా రామవరపాడులో ఆగుతుంది ఆగస్టు రెండవ తేదీ నుండి పదవ తేదీ వరకు ఈ దారి మళ్లింపు కొనసాగుతుంది.

గరీబ్ రథ్ దారి మళ్లింపు
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కూడా విజయవాడ స్టేషన్లో ఆగకుండా రాయనపాడు గుణదల మీదుగా వెళుతుంది. ఇది ఆగస్టు 2 నుండి 10వ తేదీ వరకు ఈ మార్గంలో నడుస్తుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కూడా మళ్లించిన మార్గంలోని కొనసాగుతుంది.

గాంధీ ధామ్, సాయినగర్ షిరిడీ రైళ్ళు దారి మళ్లింపు
విశాఖపట్నం- గాంధీధామ్ వెళ్లే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గాంధీధామ్- విశాఖపట్నం తిరుగు రైలు కూడా విజయవాడ స్టేషన్ లో ఆగకుండా గుణదల రాయలపాడు మీదుగా సాగుతుంది. సాయినగర్ షిరిడి వెళ్లే విశాఖపట్నం సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం నుండి సాయి నగర్ షిరిడి వెళ్లే రైలు కూడా విజయవాడ స్టేషన్లో ఆగకుండా రాయనపాడు గుణదల మీదుగా సాగుతుంది. ఇది ఆగస్టు 2నుండి 9వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు
విశాఖపట్నం నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ స్టేషన్లో ఆగకుండా గుణదల రాయనపాడు మీదుగా నడుస్తుంది. ఆగస్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ రైలు దారి మళ్లింపు కొనసాగుతుంది. హజరత్ నిజాముద్దీన్ నుండి విశాఖపట్నం వచ్చే స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా మళ్లించిన మార్గంలోనే నడుస్తుంది ఇది నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు మళ్లించిన మార్గంలో కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+