ఈవీఎంలపై బాలినేని ఫిర్యాదు - నేడే "పరీక్ష", బిగ్ టర్న్..!!
ఒంగోలు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బాలినేని ఎన్నికల ఫలితాల పై అనుమానాలు వ్యక్తం చేసారు. తమకు బలం ఉన్న ప్రాంతాల్లోనూ మెజార్టీ రాకపోవటం పైన సందేహాలతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసారు. దీని పైన ఎన్నికల సంఘం స్పందించింది. ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేసారు.
నేడే పరీక్ష
ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్లతో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు.

12 కేంద్రాల్లో
ఒంగోలు నియోజకవర్గంలోని పలు కేంద్రాల్లో పోలైన ఓట్లు...వచ్చిన మెజార్టీ పైన వైసీపీ అభ్యర్ది బాలినేని అనుమానంతో ఉన్నారు. పన్నెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ చేపట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన రూ.5.44 లక్షల నగదును ఎన్నికల సంఘానికి చెల్లించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ తమీమ్ అన్సారియా హైదరాబాద్లో శిక్షణ పొందారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏం జరుగుతోంది
ఈ క్రమంలోనే మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో నేడు మాక్ పోలింగ్..రీ చెకింగ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం బెల్ కంపెనీ ప్రతినిధులను కూడా వారు ఆహ్వానించనున్నారు. దీంతో, ఈ మాక్ పోలింగ్ నిర్వహణ..పరిశీలన సమయంలో ఎలాంటి అంశాలు గుర్తిస్తారు..ఏం జరుగుతుందనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది. ఇదే తరహాలో మరి కొందరు నేతలు ఫిర్యాదులు చేయటంతో..ఇక్కడ వచ్చే ఫలితం కీలకం కానుంది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications