బుల్లెట్ గాయం: కాశ్మీర్లో అనకాపల్లి జవాను మృతి
విశాఖపట్నం: జమ్మూకాశ్మీర్లో ఆర్మీ జవానుగా విధులు నిర్వహిస్తున్న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాను సేనాపతి నాయుడుబాబు(27) బుల్లెట్ తగలడంతో మృతి చెందాడు. దీంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జమ్మాకాశ్మీర్లోని నౌసిరా సైనిక సెక్టార్లో జవానుగా విధులు నిర్వహిస్తున్న అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన సేనాపతి నాయుడుబాబు గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

బుల్లెట్ తగలడంతో నాయుడుబాబు మృతి చెందాడని చెబుతున్నప్పటికీ అతని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నాయుడుబాబు ఐదేళ్ల క్రితమే సైన్యంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పంజాబ్లో కొంతకాలం పనిచేశాక జమ్మూకాశ్మీర్ బదలీ అయ్యాడు.
మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని అతని కుటుంబసభ్యులు తెలిపారు. సంక్రాంతికి వస్తానని ఇటీవలే ఫోన్ చేసి చెప్పాడని వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న నాయుడుబాబు తల్లిదండ్రులు చెప్పారు. నాయుడుబాబుకు ఇటీవల వివాహం నిశ్చయించామని, ఫిబ్రవరిలో పెళ్లి చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇంతలోనే తమ కుమారుడు చనిపోయాడన్న వార్త వినడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications