మిర్చి ఘాటుకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఏపీకి సూపర్ ఐడియాలు!

పండిన పంట.. నేలతల్లికి ఎర్రని పట్టుచీర కట్టినట్లు! ఆరబోసిన మిర్చి రాశులు.. నింగి నుంచి చూస్తే రంగుల హరివిల్లు నేలకు దిగినట్లు! ఎర్రని తివాచీ పరచిన ఆ పొలాల మధ్య నుండి.. రయ్ రయ్ మంటూ పరుగెత్తే రైలు బండి.. ఆ ఎరుపు కాంతిలో ఒక వెండి వెలుగు రేఖలా! ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పౌరుషానికి, ఘాటుకు ప్రతీక అయిన గుంటూరు మిర్చి ఇప్పుడు ప్రపంచ పారిశ్రామిక వేదికపై సరికొత్త రంగులు అద్దుకుంటోంది. వైరల్ గా మారిన మిర్చి వీడియోపై.. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా వేసిన ఒక ట్వీట్, దానికి ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆసక్తికరమైన కౌంటర్ సమాధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

Anand Mahindra Praises Guntur Chilli Nara Lokesh Invites Him to Build Mahindra Factories in Andhra Pradesh

ఒకవైపు ఎర్రటి సూర్యుడు, మరోవైపు నేలపైన అంతకంటే ఎర్రగా మెరిసిపోతున్న గుంటూరు మిర్చి రాశులు. ఆకాశం నుంచి చూస్తే అద్భుతమైన ఎర్రటి తివాచీ పరిచినట్లుగా కనిపించే ఈ దృశ్యాన్ని చూసి ఆనంద్ మహీంద్రా పరవశించిపోయారు. హోలీ పండుగ వేళ భారతదేశపు సహజ రంగులను చూపిస్తూ ఆయన చేసిన ట్వీట్, గుంటూరు రైతుల కష్టానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. అయితే, కేవలం ప్రశంసలతో ఆగిపోకుండా, ఈ 'రంగుల లోకాన్ని' ఒక పర్యాటక కేంద్రంగా మార్చవచ్చని ఆయన ఇచ్చిన సలహా ఏపీ పర్యాటక రంగానికి ఒక కొత్త మార్గాన్ని చూపింది.

రైతు కష్టానికి దక్కిన గౌరవం

ఆనంద్ మహీంద్రా సూచనలపై ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. "ధన్యవాదాలు ఆనంద్ జీ! మీరు చూస్తున్న ఈ రంగుల దృశ్యం వెనుక వేలాది మంది రైతుల అకుంఠిత దీక్ష, కఠిన శ్రమ దాగి ఉన్నాయి. ఆ శ్రమ వల్లే గుంటూరు నేడు ప్రపంచ మిర్చి ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది" అంటూ లోకేష్ రైతులకు క్రెడిట్ ఇచ్చారు. అంతేకాకుండా, మహీంద్రా సూచించిన పర్యాటక అవకాశాలను పరిశీలించాల్సిందిగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కోరుతానని హామీ ఇచ్చారు.

లోకేష్ స్పందన కేవలం పర్యాటకానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన ఈ సందర్భాన్ని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని హైలైట్ చేయడానికి చాలా చాకచక్యంగా వాడుకున్నారు. "భవిష్యత్తులో ఏపీ నుంచ వచ్చే డ్రోన్ విజువల్స్ కేవలం మిర్చి పంటనే కాదు.. మహీంద్రా ఆటో ఫ్యాక్టరీని, డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్లను, ఏరోస్పేస్ పార్కులను కూడా చూపించాలని నేను కోరుకుంటున్నాను" అంటూ మహీంద్రా గ్రూప్‌ను ఏపీలో పెట్టుబడులకు పరోక్షంగా ఆహ్వానించారు.

ఏపీ ఆఫర్ చేస్తున్న అవకాశాలు:

మంత్రి లోకేష్ తన ట్వీట్ ద్వారా ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని ఆనంద్ మహీంద్రా ముందు ఆవిష్కరించారు:

  • అనుకూల వాతావరణం: పారిశ్రామిక వేత్తలను సాదరంగా ఆహ్వానించే 'స్పీడ్ ఆఫ్ బిజినెస్' పాలసీ.
  • భౌగోళిక ప్రాధాన్యత: కోస్తా తీరం, ఎయిర్‌పోర్ట్‌లు, మరియు అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ పార్కులు.
  • ఆహ్వానం: "ఏపీ ఏమి ఆఫర్ చేయగలదో మీకు స్వయంగా చూపించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను" అంటూ ఆనంద్ మహీంద్రాకు లోకేష్ బహిరంగ ఆహ్వానం పలికారు.

పర్యాటకం + పరిశ్రమ = సమగ్ర అభివృద్ధి

ఆనంద్ మహీంద్రా సూచించినట్లుగా గుంటూరు మిర్చి యార్డులో బెలూన్ రైడ్స్, మిర్చి ఫెస్టివల్స్ వంటివి ఏర్పాటు చేస్తే అది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతుంది. అదే సమయంలో, లోకేష్ కోరుకున్నట్లుగా మహీంద్రా వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తే అది యువతకు ఉపాధిని, రాష్ట్రానికి ఆర్థిక పుష్టిని చేకూరుస్తుంది.

కష్టానికి దక్కిన కళాత్మక గుర్తింపు

నిజానికి ఇది కేవలం ఒక పంట కాదు, మన రైతన్నల చెమట చుక్కల ప్రతిరూపం. పంట కోసిన తర్వాత రైతులు మిర్చిని వరుసలుగా ఎండబెట్టిన తీరు, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ల డ్రోన్ కెమెరాల్లో ఒక అద్భుతమైన 'ఆర్ట్'లా కనిపిస్తోంది. ఆకాశం నుండి చూస్తే అల్లిక చేసినట్లుగా ఉండే ఆ ఎరుపు రంగు ప్యాటర్న్లు, వాటి మధ్యలో సాగిపోయే రైలు పట్టాలు ఒక జీవకళా చిత్రపటంలా కనువిందు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+