ఉరవకొండ ఏఎస్ఐపై కొడవలితో దాడి: పరిస్ధితి విషమం
అమరావతి: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ఏఎస్ఐ మహేంద్రపై రౌడీషీటర్ రామాంజనేయులు మంగళవారం కొడవలితో దాడి చేశాడు. గతంలో ఓ కేసు విషయంలో రామాంజనేయులుపై రౌడీషీటర్ ఓపెన్ చేయడమే దాడి చేయడానికి గల కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఏఎస్ఐ మహేంద్ర ఉరవకొండలో డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరాడు. ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రౌడీషీటర్ రామాంజనేయులు ఏఎస్ఐపై దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో మహేంద్ర తలకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం అవుతండటంతో కుటుంబ సభ్యులు హుటాహటిన మహేంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
శస్త్రచికత్స చేసిన వైద్యులు 10 కుట్లు వేశారు. మహేంద్ర పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. రౌడీషీటర్ కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. రామాంజనేయులు గుంతకల్లులో ఆటో డ్రైవర్గా పని చేసేవాడు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications