ఉరవకొండ ఏఎస్ఐపై కొడవలితో దాడి: పరిస్ధితి విషమం
అమరావతి: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ఏఎస్ఐ మహేంద్రపై రౌడీషీటర్ రామాంజనేయులు మంగళవారం కొడవలితో దాడి చేశాడు. గతంలో ఓ కేసు విషయంలో రామాంజనేయులుపై రౌడీషీటర్ ఓపెన్ చేయడమే దాడి చేయడానికి గల కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఏఎస్ఐ మహేంద్ర ఉరవకొండలో డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరాడు. ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో రౌడీషీటర్ రామాంజనేయులు ఏఎస్ఐపై దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో మహేంద్ర తలకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం అవుతండటంతో కుటుంబ సభ్యులు హుటాహటిన మహేంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
శస్త్రచికత్స చేసిన వైద్యులు 10 కుట్లు వేశారు. మహేంద్ర పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. రౌడీషీటర్ కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. రామాంజనేయులు గుంతకల్లులో ఆటో డ్రైవర్గా పని చేసేవాడు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications