Anantha babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో భారీ ట్విస్ట్..!!
వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ హత్యలో అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గ (రోజా) పాత్రపై సిట్ (SIT) కీలక ఆధారాలను సేకరించింది. ఈ మేరకు ఆమెను రెండో నిందితురాలిగా (A-2) చేరుస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో సిట్ బుధవారం అదనపు అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది.
హత్యలో భార్య క్రియాశీలక పాత్ర!
సుబ్రహ్మణ్యం హత్యకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కేవలం సహకరించడమే కాకుండా, ఆయనను ఈ నేరానికి పురికొల్పారని సిట్ నిర్ధారించింది. హత్య జరిగిన రోజు రాత్రి ఆమె అపార్ట్మెంట్ వాచ్మన్ కుమార్తెను ఒక పెద్ద కర్ర కావాలని అడిగి మరీ తీసుకున్నట్లు సాక్ష్యాధారాలు లభించాయి. హత్య జరిగిన సమయంలో ఆమె ఘటనా స్థలంలోనే ఉన్నారని, ఆ తర్వాత మృతదేహాన్ని తరలించిన కారులో కూడా అనంతబాబుతో కలిసి ప్రయాణించారని సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టమైంది.

అబద్ధపు వాంగ్మూలాలు - సాంకేతిక ఆధారాలు
గతంలో పోలీసుల విచారణలో తాను ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్నానని లక్ష్మీదుర్గ చెప్పిన మాటలు పచ్చి అబద్ధమని తేలింది. సిట్ అధికారులు 14 చోట్ల నుంచి సీసీ కెమెరా దృశ్యాలను సేకరించి విశ్లేషించగా, ఆమె ఆసుపత్రిలో లేరని, హత్య జరిగిన చీకటి ప్రదేశంలోనే ఉన్నారని నిరూపితమైంది. సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో, మృతదేహాన్ని మాయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు సిట్ అభియోగపత్రంలో పేర్కొంది.
పుట్టినరోజే రక్తపాతం
2022 మే 19న అనంతబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ రాత్రే ఈ ఘాతుకం చోటుచేసుకుంది. పాత బకాయి రూ. 20 వేల కోసం సుబ్రహ్మణ్యాన్ని బెదిరించిన అనంతబాబు, రాత్రివేళ తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. గెస్ట్ హౌస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి, ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటి వద్దే పడేసి, "నోరు మూసుకుంటే రూ. 2 లక్షలు ఇస్తాం" అంటూ బెదిరించిన వైనాన్ని సిట్ పూసగుచ్చినట్లు వివరించింది.
నాడు నీరుగార్చి.. నేడు నిగ్గుతేల్చి
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఈ కేసును తూతూమంత్రంగా దర్యాప్తు చేశారని, కీలక సాంకేతిక ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే వదిలేశారని సిట్ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, బాధితుల విన్నపం మేరకు గతేడాది జూలైలో సిట్ను ఏర్పాటు చేసింది. సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రాసిక్యూషన్కు సహకరిస్తుండటంతో కేసులో వేగం పెరిగింది. నిందితులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా చర్యలకు సిట్ సిఫార్సు చేసింది.
పరారీలో ఏ-2 లక్ష్మీదుర్గ
ప్రధాన నిందితుడు అనంతబాబు ప్రస్తుతం బెయిల్పై ఉండగా, తాజాగా రెండో నిందితురాలిగా నమోదైన ఆయన భార్య లక్ష్మీదుర్గ పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ ఒత్తిళ్లతో మరుగున పడిన సాక్ష్యాలను సిట్ వెలికితీయడంతో, బాధితులకు న్యాయం జరుగుతుందన్న ఆశలు చిగురించాయి. కారు డ్రైవర్ హత్యలో దంపతులిద్దరూ భాగస్వాములేనన్న పక్కా ఆధారాలతో కోర్టు విచారణ ప్రారంభం కానుంది.
-
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! -
రేవంత్ రాజ్యసభ ఛాయిస్ 'ఆయనే', కొత్త పేరుతో ఖర్గే బ్రేక్ - రాహుల్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications