వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకలో ఆంధ్ర దంపతుల మృతి: వారం క్రితమే వెళ్లారు

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరం గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన యువతీయువకులు ఇద్దరు శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారి మృతిని పోలీసులు శుక్రవారం గుర్తించారు.

విశాఖపట్నం గాజువాకకు చెందిన టి పృధ్వీరామ్ (30), నాగబోయిన మహాలక్ష్మి (27) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు వారం రోజుల కిందట శ్రీలంక వెళ్లారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఒక హోటల్‌లో దిగారు.

Suicide

ఈ నెల 2వ తేదీ రాత్రి హోటల్ గదిలోకి వెళ్లిన జంట తిరిగి బయటకు రాకపోవటంతో అనుమానించిన హోటల్ సిబ్బంది శుక్రవారం గది తెరచి చూడగా, ఇద్దరూ మృతి చెంది ఉన్నట్టు గుర్తించారు.

ఈ విషయాన్ని విశాఖ నగర పోలీసులకు సమాచారం అందించారు. నగర స్పెషల్‌బ్రాంచ్ ఎసిపి ఆర్‌ఎంకె మూర్తి గాజువాకలోని వారి కుటుంబసభ్యులకు సమాచారం తెలిపారు.

మృతి చెందిన యువకుడి వయస్సు 30 ఏళ్లు, మహిళ వయస్సు 27 ఏళ్లు ఉండవచ్చునని అంటున్నారు. నిజానికి, వారిద్దరు కొలంబో సమీపంలోని వెల్లవెట్టాలో గల ఈ హోటల్‌లో మార్చి 27వ తేదీ నుంచి ఉంటున్నారు.

English summary
Andhra couple from Visakhapatnam district died in srilanka hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X