Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘సాక్షి’ ఛైర్మన్, ఎడిటోరియల్ డైరెక్టర్ పై అరెస్ట్ వారెంట్

పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానందుకు ‘సాక్షి’ దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై కృష్ణా జిల్లా నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

అమరావతి: 'సాక్షి' దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై కృష్ణా జిల్లా నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానందుకు ఈ మేరకు కోర్టు వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే... కృష్ణా జిల్లా 'తెలుగు రైతు' అధ్యక్షుడు చలసాని ఆంజనేయులిపై ఇటీవల సాక్షి దినపత్రికలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆయన.. తనపై అసత్య కథనాలు ప్రచురించారంటూ కోర్టుకెళ్లారు.

ramachandra-murthy-bharathi

తప్పుడు కథనాలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ 'సాక్షి' దినపత్రిక చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై చలసాని ఆంజనేయులు పరువునష్టం దావా వేశారు.

ఈ కేసు విచారణ నిమిత్తం భారతిరెడ్డి, రామచంద్రమూర్తి కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+