ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తోంది. ఇందుకు కారణం ఈ రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో 81శాతం పోలింగ్ నమోదు కావడమే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల పల్స్ను పట్టుకోవడంలో విఫలమయ్యాయనే చెప్పొచ్చు. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారో స్పష్టంగా చెప్పడం కష్టతరంగా మారింది. వాస్తవ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎవరికి అంతు చిక్కడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని రెండు ప్రధాన పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి పట్టం కట్టగా.. ఇంకొన్ని సంస్థలు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇక జూన 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.
10:35 PM, 4 Jun
ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఉత్సాహంగా చూశాయన్నారు. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో చరిత్ర సృష్టించాం.1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదన్నారు.పూరీ జగన్నాథుడి ఆశీర్వాదంతో ఒడిశాలో విజయం దక్కిందన్నారు.
మన ఎన్నికల ప్రక్రియను చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ఎన్నికల వల్లే మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్నారు. ‘‘రాష్ట్రాల్లో ఎన్డీయేకు గొప్ప విజయం దక్కింది
9:59 PM, 4 Jun
మొత్తం 175 స్థానాలకు గానూ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది.
9:57 PM, 4 Jun
దర్శి లో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీపై వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ 2,597 ఓట్లతో విజయం సాధించారు.
8:53 PM, 4 Jun
ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో వైకాపా ఒక్క సీటూ గెలవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.
మొత్తం 175 స్థానాలకు గానూ 165 స్థానాల్లో విజయం
8:23 PM, 4 Jun
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 175 స్థానాల్లో పోటీ చేసిన ఆపార్టీ కేవలం పది స్థానాల్లోనే విజయం సాధించింది. కనీసం ప్రతిపక్షహోదాను కూడా కోల్పోయింది. పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బద్వేల్ (ఎస్సీ) - దాసరి సుధ, పులివెందుల -వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రాలయం - వై.బాలనాగిరెడ్డి, ఆలూరు - బూసినే విరూపాక్షి, యర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్, అరకు (ఎస్టీ) - రేగం మత్స్యలింగం, పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారాకనాథ్రెడ్డి గెలుపొందారు.
8:19 PM, 4 Jun
ఎన్డీయేకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపూర్వ విజయం అందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఘన విజయం సాధించినందుకు గానూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.
7:55 PM, 4 Jun
ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలతో పాటు, వివిధ అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు
7:45 PM, 4 Jun
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అభినందనలు., శుభాకాంక్షలు తెలిపారు.
7:37 PM, 4 Jun
జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి 16,312 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ఎం.సుధీర్రెడ్డిపై విజయం సాధించారు.
7:36 PM, 4 Jun
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రాంనారాయణరెడ్డి 6880 ఓట్ల మెజార్టీతో వైసీపీ నేత మేకపాటి విక్రమ్రెడ్డిపై గెలుపు
7:36 PM, 4 Jun
గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి 1,080 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కందూరు నాగార్జునరెడ్డిపై జయకేతనం ఎగురవేశారు
7:23 PM, 4 Jun
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి అభినందనలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య
సత్సంబంధాలను కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని పేర్కొన్నారు.
7:19 PM, 4 Jun
గవర్నర్కు తన రాజీనామా లేఖను పంపిన జగన్
7:19 PM, 4 Jun
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా.
7:15 PM, 4 Jun
ఉద్యోగులకు సీపీఎస్ విషయంలో న్యాయం చేస్తా. మెగా డీఎస్సీ విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా. డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రాలేదు: పవన్ కల్యాణ్
7:11 PM, 4 Jun
ఏపీకి చీకటి రోజులు ముగిశాయి . పవన్ కల్యాణ్
7:10 PM, 4 Jun
విజయంతో వైసీపీని భవిష్యత్తులో ఇబ్బందిపెట్టబోం:పవన్ కల్యాణ్
7:09 PM, 4 Jun
5 కోట్ల మంది ప్రజల కోసం పని చేయాల్సిన సమయం ఇది. నా జీవితంలో ఇప్పటి వరకు విజయం తెలియదు: పవన్ కల్యాణ్
7:08 PM, 4 Jun
జగన్,వైసీపీ నాకు వ్యక్తిగతంగా శత్రువులు కాదు:పవన్ కల్యాణ్
7:06 PM, 4 Jun
ఇది ఎంతో చారిత్రాత్మకమైన రోజు. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం:పవన్ కల్యాణ్
7:05 PM, 4 Jun
దేశంలో వందకు వందశాతం కొట్టేవాడే జనసైనికుడు:పవన్ కల్యాణ్
7:04 PM, 4 Jun
వైసీపీ నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు : పవన్ కల్యాణ్
7:03 PM, 4 Jun
8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురంలో పరాజయం
7:01 PM, 4 Jun
గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గెలుపు
6:58 PM, 4 Jun
మంగళగిరిలో నారా లోకేష్ 91 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం
6:54 PM, 4 Jun
పుంగనూరులో వైసీపీ అభ్యర్థి 5వేల ఓట్ల మెజార్టీతో మంత్రి పెద్దిరెడ్డి గెలుపు
6:53 PM, 4 Jun
కడప లోక్సభ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి 69,050 ఓట్ల మెజార్టీతో విజయం
6:52 PM, 4 Jun
ఉమ్మడి తూర్పుగోదావరిలో టీడీపీ 9, జనసేన 6 స్థానాల్లో గెలుపు
READ MORE
7:46 PM, 3 Jun
మరి కొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఫలితాలు
7:47 PM, 3 Jun
జూన్ 4వ తేదీన వెలువడనున్న ఏపీ అసెంబ్లీ ఫలితాలు
7:48 PM, 3 Jun
జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
7:48 PM, 3 Jun
ఓటరు నాడిని స్పష్టంగా పట్టుకోవడంలో విఫలమైన ఎగ్జిట్ పోల్స్
7:49 PM, 3 Jun
కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలను ఇవ్వగా.. మరికొన్ని సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి
5:41 AM, 4 Jun
మరి కొద్ది సేపట్లో ఏపీ అసెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
5:41 AM, 4 Jun
కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
5:45 AM, 4 Jun
ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు. అనంతరం ఈవీఎంలను తెరవనున్న కౌంటింగ్ సిబ్బంది
5:45 AM, 4 Jun
ముందుగా కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు
5:46 AM, 4 Jun
అన్ని నియోజకవర్గాలకంటే ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు విడుదల
5:49 AM, 4 Jun
ఎంపీ స్థానాల్లో రాజమండ్రి,నరసాపురం లోక్సభ స్థానాల ఫలితాలు విడుదల
5:59 AM, 4 Jun
ఆంధ్రప్రదేశ్
2019లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు
2019లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వైసీపీ టీడీపీ మధ్య ఇలా ఉన్నాయి
6:00 AM, 4 Jun
2019లో వైయస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 151 స్థానాలు గెలుపొంది అధికారంలోకి వచ్చింది. టీడీపీ 23 సీట్లకే పరిమితం కాగా ఒకటి జనసేన పార్టీకి దక్కింది
6:10 AM, 4 Jun
ఆంధ్రప్రదేశ్
ట్విటర్లో వైసీపీ ట్రెండింగ్
ఏపీలో ట్విటర్ పై ట్రెండ్ అవుతోన్ #Ysrcpwinningbig అనే ట్యాగ్
ఓం నమో వేంకటేశాయః గోవింద గోవింద ✅☮️ జగన్ అన్నని 151++సీట్స్ తో గెలిపించి అంతా సక్రమంగా జరిగేలా చూడు స్వామి 🙏🙏