వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అసెంబ్లీ: గొడుగు, రెయిన్ కోట్‌తో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేత ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

గొడుగు, రెయిన్ కోట్‌తో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీకి బీజేపీ ప్రతినిధులు గొడుగులతో వచ్చి నిరసన తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోనే ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ లీకుల మయంగా ఉందని, చిన్నపాటి వర్షం కురిస్తే నీళ్లు కురుస్తున్నాయని విమర్శించారు. అందుకే ముందు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చామన్నారు. రూ.1000 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజా ధనం దుర్వినియోగంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారన్నారు. చదరపు అడుగుకు రూ.10వేలు వెచ్చించి తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం చేయించిన ఘనత బాబుకే దక్కిందన్నారు.

Andhra Pradesh Assembly session begins

ఏపీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి 19వ తేదీ వరకు జరగనున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు అంతకుముందు తెలిపారు. కాల్వ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ... సమావేశ వివరాలు తెలియజేశారు. మొత్తం ఏడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయన్నారు.

కాగా, సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యశాఖ పని తీరు, ఆసుపత్రుల్లో పరిస్థితులపై సభ్యులు ప్రశ్నించారు. విశాఖ కెజీహెచ్‌లో పరిస్థితులను బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు వివరించారు. పలాస హెల్త్ సెంటర్లో సరైన వైద్యం అందటం లేదని ఎమ్మెల్యే గౌతు శివాజీ అన్నారు. తమ నియోజవకర్గంలో అదే పరిస్థితి ఉందని తణుకు, తాటికొండ ఎమ్మెల్యేలు అన్నారు.

బీజేపీ నేతలపై టీడీపీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. బీజేపీ నేతలు ఆటలో బుడంకాయల్లా మారారన్నారు. బీజేపీ పగటి వేషగాళ్లతో ఒరిగేదేమీ లేదన్నారు. అసెంబ్లీకి రాని వైసీపీ వెనుకుండి బీజేపీతో ఆటలుఆడిస్తోందన్నారు. దేశ ప్రజల జేబులకు మోడీ చిల్లులు పెట్టారన్నారు. మోడీని ఎప్పుడు సాగనంపాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పని తీరుతో మోడీ, జగన్‌లకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు.

English summary
Andhra Pradesh assembly session begun on Thursday morning. BJP MLAs came with umbrellas and raincoats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X