ఏపీలో 25 మంది ఎంపీల్లో ఎవరెక్కడ ? ఎందుకంటే? తాజా సర్వే రిపోర్ట్..!
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో అధికారం అందుకున్న కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తిచేసుకుంటోంది. అలాగే విపక్ష వైసీపీ కూడా ప్రభుత్వంపై పోరాటాలతో తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కూటమితో పాటు వైసీపీకి చెందిన ఎంపీల పనితీరు ఎలా ఉందన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దీన్ని తెలుసుకునేందుకు రాజకీయ విశ్లేషకుడు, సర్వేయర్ ప్రవీణ్ పుల్లట ఓ సర్వే నిర్వహించారు.
మన రాష్ట్రంలో మొత్తం 25 మంది లోక్ సభ్యులు ఉన్నారు. ఇందులో టీడీపీకి 16 మంది, బీజేపీకి ముగ్గురు, జనసేనకు ఇద్దరు, వైసీపీకి నలుగురు ఉన్నారు. వీరిలో టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీకి చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్రమంత్రులుగా ఉన్నారు. వీరిలో తాజా సర్వే ప్రకారం కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు టాప్ 2గా నిలిచారు. వీరి తర్వాత స్ధానాల్లో పుట్టా మహేష్ యాదవ్(టీడీపీ), బైరెడ్డి శబరి(టీడీపీ), గురుమూర్తి(వైసీపీ), లావు కృష్ణదేవరాయలు (టీడీపీ), కేశినేని శివనాథ్ (టీడీపీ), దగ్గుమళ్ల ప్రసాదరావు(టీడీపీ), భూపతిరాజు శ్రీనివాసవర్మ (బీజేపీ), శ్రీభరత్ (టీడీపీ) టాప్ 10లో ఉన్నారు.

ఆ తర్వాత 11వ స్ధానంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (వైసీపీ) .. ఆ తర్వాత ఉదయ్ శ్రీనివాస్(జనసేన), అప్పలనాయుడు (టీడీపీ), పురందేశ్వరి (బీజేపీ), హరీష్ మాథుర్ (టీడీపీ), బాలశౌరి(జనసేన), సీఎం రమేష్ (బీజేపీ), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (టీడీపీ), కృష్ణప్రసాద్ (టీడీపీ), వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ), బీకే పార్ధసారధి (టీడీపీ), మాగుంట శ్రీనివాసులురెడ్డి (టీడీపీ), అంబికా లక్ష్మీనారాయణ (టీడీపీ), తనూజారాణి (వైసీపీ), నాగరాజు (టీడీపీ) ఉన్నారు.

"This report aims to foster transparency, accountability, and data-based evaluation of elected representatives. Andhra Pradesh shows promising signs of strong leadership, but continuous improvement is essential for equitable development across all regions,"
— Praveen Pullata (@praveenpullata) December 6, 2025
— RISE Research… pic.twitter.com/RatBhIoJzZ
ఈ సర్వేకు ప్రామాణికంగా తీసుకున్న అంశాల్లో నియోజకవర్గంలో పర్యటనలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం, డిజిటల్, సోషల్ మీడియాలో స్పందన, పార్లమెంట్ లో చర్చలు, జీవో అవర్ లో పాల్గొనడం వంటివి ఉన్నాయి. అలాగే ఆయా ఎంపీలు తమ పనితీరు మెరుగుపర్చుకోవడానికి జనానికి అందుబాటులో ఉండాలని, పార్లమెంట్ కు తరచూ హాజరుకావాలని సర్వే నిపుణుడు ప్రవీణ్ సూచించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications