ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 6వేల మార్క్ దాటింది, 84కు చేరిన మృతులు
అమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 15,633 మంది నమూనాలు పరీక్షించగా 294 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. అయితే, వీరిలో విదేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు ఉండగా, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39 మంది ఉన్నారు.
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 253గా ఉంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6152కు చేరింది. కరోనా కారణంగా గడిచిన 24గంటల్లో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 84కు చేరింది.
ఇక
విదేశాల
నుంచి
వచ్చిన
వారిలో
204
మందికి
కరోనా
పాజిటివ్
రాగా,
ప్రస్తుతం
181
యాక్టివ్
కేసులున్నాయి.
ఆదివారం
ఒకరు
డిశ్చార్జ్
అయ్యారు.
ఇతర
రాష్ట్రాల
నుంచి
ఏపికి
వచ్చిన
వారిలో
1107
మందికి
కరోనా
పాజిటివ్
వచ్చింది.
అందులో
537
పాజిటివ్
కేసులు
ప్రస్తుతం
చికిత్స
పొందుతున్నారు.
ఈ
ఒక్కరోజే
48
మంది
డిశ్చార్జ్
అయ్యారు.
ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2723కి చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో 2034 మంది చికిత్స పొందుతున్నారు.
Recommended Video
ఏపీలో
కరోనాకు
సంబంధించిన
అధికారిక
సమాచారం
కావాలంటే..
వాట్సాప్
చాట్
బాట్
నెంబర్
8297-104-104కు
hi,
hello,
covid
అని
మెసేజ్
చేయండి.
స్మార్ట్
ఫోన్
లేనివారు
8297-104-104
నెంబర్
కు
ఫోన్
చేసి
IVRS
ద్వారా
కూడా
సమాచారం
పొందవచ్చు.
వైద్య
సాయం
కోసం
14400కు
ఫోన్
చేయవచ్చు.