బ్రదర్ అనిల్ సభల్లో కల్పన ప్రచారం, వదిలేశానని కిరణ్

ఈ సభలో కల్పన.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయాలంటూ ప్రచారం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అభ్యంతరం తెలపడంతో కల్పన వెనుదిరిగారు. ఈ వ్యవహారంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పార్టీ నేతలు కోడ్ ఉల్లఘించారని స్పష్టం తెలిసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా, సువార్త సభలకు రావడానికి అనిల్ ఉపయోగించిన వాహనంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాలున్నాయి.
టిడిపి వర్సెస్ జగన్ పార్టీ
కృష్ణా జిల్లాలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు నేతల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. కోడూరు మండలం కంభంపాడులో జగన్ పర్యటన ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు టిడిపితో వాగ్వాదానికి దిగారు. వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు టిడిపి నేతలకు గాయాలయ్యాయి.
తూగోలో కిరణ్
జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు జాతికి తీవ్రనష్టం జరిగిందన్నారు. విభజనకు కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కారణమని, ఆ పార్టీలకు ఓటేస్తే విభజనకు ఓటేసినట్లే అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం తాను సిఎం పదవిని సైతం వదులుకున్నానని చెప్పారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications