మాచర్లలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం తర్వాత వైరల్ అవుతున్న మరో ఈవీఎం ధ్వంసం వీడియో
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మే 13న జరిగిన ఎన్నికల పోలింగ్ నాడు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ గా స్పందించింది. తక్షణం ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్ట్ చేశారు.
మరో ఈవీఎం ధ్వంసం వీడియో వైరల్
ఇక వైసీపీ నేతల దాడులు, ఈవీఎంల ధ్వంసం ఘటనలను తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతుంటే, వైసిపి కూడా ఒక వీడియోతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత ప్రస్తుతం సోషల్ మీడియాలో మరొక వీడియో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో జనసేన అభ్యర్థి ఈవీఎం ధ్వంసం వీడియో వైరల్
ఈ వీడియోతో గుంతకల్లు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా EVM లు ధ్వంసం చేశారని, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పై కేసు నమోదుతో తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చిందని, దీనిపై ఎన్నికల సంఘం ఏమి చర్యలు తీసుకుంటుందో మరి అంటూ సోషల్ మీడియా వేదికగా ఇది వైరల్ అవుతుంది.
2019 గుత్తి పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటన
అయితే ఈ వీడియో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన వీడియో కాదు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఘటన. 2019 ఏప్రిల్ 11వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ సమయంలో ఈవీఎం మిషన్లో తన ఫోటో లేదని, పేరు సరిగ్గా రాయలేదని ఆగ్రహానికి గురయ్యారు.
గుంతకల్లు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా EVM లు ధ్వంసం చేసాడు.
— Hariswar Reddy (@hariswar_Reddy_) May 22, 2024
పల్నాడు టీడీపీ నేతలకు ఇవి కనిపించలేదా.
పాపం భ్రమలో బ్రతుకుతున్నట్లు ఉంది పల్నాడు టీడీపీ అభ్యర్థి.
టీడీపీ అరాచకాలు కప్పి పుచ్చుకోవడం పుచ్చుపోయిన తెలివి తేటలతో అధికార పార్టీ పైన నెగటివ్ చేయాలి… pic.twitter.com/VsGfuUsqoW
ఈవీఎం ధ్వంసం చేసిన మధుసూదన్ గుప్తా.. పాత వీడియో మళ్ళీ వైరల్
చాలా అన్యాయమైన ఎలక్షన్ జరుగుతుందంటూ ఆ ఈవీఎం మిషన్ ను మీడియా సాక్షిగా ధ్వంసం చేశారు. ఇక కోపంతో ఆయన చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ కు ఉపయోగించే ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఇక నాటి వీడియోని ప్రస్తుతం మళ్ళీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ల ధ్వంసం వీడియో బయటకు వచ్చిన నేపధ్యంలో మళ్ళీ వైరల్ చేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications