Chandrababu: చంద్రబాబుకు ఈసీ మరో గుడ్ న్యూస్..!
ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబుకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని భావిస్తున్న చంద్రబాబు..ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వరుసగా ఈసీ, గవర్నర్ ను ఆశ్రయిస్తున్నారు. ఇందులో ప్రతీ చోటా చంద్రబాబుకు అనుకూలంగానే నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఆయన కోరుకున్న విధంగా వారి నిర్ణయాలు ఉంటుండటంతో టీడీపీ క్యాడర్ లోనూ జోష్ నెలకొంటోంది.
ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ కు ముందు సంక్షేమ పథకాల డబ్బుల విడుదలకు సిద్దమైన ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ఈసీని చంద్రబాబు కోరడం, ఆ మేరకు పోలింగ్ తర్వాతే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల మొత్తాలు విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే.ఆ తర్వాత పోలింగ్ ముగియడంతో సంక్షేమ పథకాల డబ్బులు విడుదల చేయకుండా పాత బిల్లులు క్లియర్ చేస్తున్నారంటూ టీడీపీ గవర్నర్ ను ఆశ్రయించడంతో దానికీ అడ్డుకట్ట పడింది.

ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు ముందే పాలనలో కీలకమైన ఈ-ఆఫీస్ సాప్ట్ వేర్ అప్ గ్రేడ్ చేసేందుకు అదికారులు సిద్ధమయ్యారు. దీనిపైనా చంద్రబాబు ఈసీని ఆశ్రయించారు. నిన్న ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఫలితాల వేళ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ చేయడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఈ ప్రక్రియను వాయిదా వేయించాలని కోరారు. దీనికీ ఈసీ అంగీకరించింది.
చంద్రబాబు లేఖ అందుకున్న సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ ఎన్ఐసీ ప్రతినిధుల్ని పిలిపించి ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేసే ప్రక్రియను వాయిదా వేసుకోవాలని ఆదేశించారు. విపక్షాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి దీన్ని వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెర్షన్ తోనే ఈ-ఆఫీస్ ను కొనసాగించాలని సూచించారు. దీంతో ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ చేసే ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్ఐసీ నిర్ణయించింది.
-
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!











Click it and Unblock the Notifications