Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ఎన్నికల్లో విచిత్రం: ఆరుమంది మాజీ సీఎంల పిల్లలు పోటీ

AP election 2024: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. లోక్‌సభతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాల అయిదేళ్ల పదవీ కాలం ముగిసినట్టయింది. ఓటర్లు కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

AP Assembly election 2024 6 Former Chief Minister s sons and daughters are in the race

ఏపీలో ఈ ఎన్నికల్లో ఓ విచత్ర పరిస్థితి నెలకొంది. ఏకంగా ఆరు మంది మాజీ/దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో ఈ తరహా పోటీ ఎప్పుడూ లేదనే చెప్పుకోవచ్చు. ఒకే ఎన్నికల్లో ఇంతమంది మాజీ/దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోండటం, వారంతా వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేయబోతోండటం ఆసక్తి రేపుతోంది. వారిలో ఎంతమంది గెలవగలుగుతారనేది ఉత్కంఠతగా మారింది.

AP Assembly election 2024 6 Former Chief Minister s sons and daughters are in the race

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎప్పట్లాగే కడప జిల్లా పులివెందుల నుంచి రేసులో నిలిచారు. ఎదుర్కొన్న రెండో ఎన్నికలోనే తండ్రి పేరు మీద స్థాపించిన పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలిగారు. వరుసగా రెండోసారీ విజయఢంకా మోగించాలనే పట్టుదలతో ఉన్నారు.

వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల కూడా ఈ సారి ఏపీ నుంచే ఎన్నికల బరిలో నిల్చోబోతోన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కడప లోక్‌సభ లేదా అదే జిల్లాలోని కమలాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నుంచి రెండోసారి బరిలో నిలిచారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. గతంలో శాసన మండలికి నామినేట్ అయ్యారు. తండ్రి కేబినెట్‌లో మూడు శాఖల మంత్రిగా గుర్తింపు పొందారు.

AP Assembly election 2024 6 Former Chief Minister s sons and daughters are in the race

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పిల్లలు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి వేర్వేరు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. తన కుటుంబానికి బాగా అచ్చివచ్చిన శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి బాలకృష్ణ.. మూడోసారి పోటీలో నిలిచారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది.

దివంగత మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారులు సూర్యప్రకాష్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సూర్యప్రకాష్ రెడ్డి, తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రేసులో నిలిచారు.

AP Assembly election 2024 6 Former Chief Minister s sons and daughters are in the race

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కుమారుడు నాదెండ్ల మనోహర్.. గుంటూరు జిల్లాలోని తెనాలి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. జనసేన పార్టీ తరఫున ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇది తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ఇదే తెనాలి నుంచి రెండుసార్లు విజయం సాధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+