కల్తీ నెయ్యి అంశం పై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం, ఇక ఫిక్స్..!!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా సంచలనంగా మారిన కల్తీ నెయ్యి అంశం పైన సిట్ విచారణ చేసింది. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అప్పట్లో పని చేసిన అధికారుల పై చర్యలను సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా ఈవోగా ఉన్న అనీల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా మారటంతో తాజాగా ప్రభుత్వం ఈ అంశంలో అసలు దోషులను తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. ఇందు కోసం కేబినెట్ లో సుదీర్ఘ చర్చ తరువాత కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది.
కల్తీ నెయ్యి నివేదిక పైన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ ఇచ్చిన నివేదికను అధికారులు మంత్రులకు వివరించారు. చర్చ తరువాత మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి, అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడం పైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. టెండర్ నిబంధనలను మార్చినప్పటికీ ఈఓగా ఉన్న సింఘాల్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు మంత్రులు ప్రశ్నలు లేవనెత్తారు. 2022లో సీఎఫ్టీఆర్ఐ నివేదికలో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా పట్టించుకోకపోవడంపై చర్చించారు. అప్పటి అధికారులు బాలాజీ, సుబ్రహ్మణ్యం దానిని పక్కన పెట్టారని నివేదికలో పేర్కొన్నారు. ఎన్డీడీబీ నివేదికలో యానిమల్ ఫ్యాట్ ఉందని తేలిందని, అదే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రులు తెలిపారు. సిట్ నివేదికలో కొంతమంది పేర్లు పేర్కొన్నా.. చివరి ఫైండింగ్స్లో వాటిని పేర్కొనకపోవడంపై చర్చ జరిగింది. ఈ లోపాలన్నింటిపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది.

నివేదిక ఆధారంగా చర్యలు
కాగా, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించింది. టెండర్ ప్రక్రియలో లోపాలపై దృష్టి సారించాలని కమిటీకి మంత్రిమండలి సూచించింది. సహకార డెయిరీలను పక్కన పెట్టేందుకు పథకం రూపొందించారని కేబినెట్ పేర్కొంది. సహకార డెయిరీలను పక్కన పెట్టడం ద్వారా బోగస్ డెయిరీలను రంగంలోకి తీసుకువచ్చారని అధికారులు వివరించారు. దీనిపైనా ఎంక్వైరీ కమిటీ దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. అడ్వకేట్ జనరల్, సీనియర్ అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అప్పటి చైర్మన్ సుబ్ బారెడ్డి పాత్ర గురించి సిట్ నివేదికలో ఏమైనా పేర్కొన్నారా అనే అంశం పైన డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీసినట్లు సమాచారం. అయితే, అసలు సూత్రధారులను వెంటనే తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సిట్ నివేదికలో లోపాలు ఉన్నాయని, అసలు సూత్రధారులను బయటకు తీసుకురాలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయాలను బహిర్గతం చేసేందుకే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కు అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు. నివేదిక వచ్చిన వెంటనే ఎవరిపై చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని స్పష్టం చేసారు.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్, ఇక నుంచి..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!










Click it and Unblock the Notifications