సుప్రీంకోర్టు ముందుకు జగన్ లేఖ వ్యవహారం... విచారణ నుంచి ఉపసంహరించుకున్న జస్టిస్ యూయూ లలిత్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ, ఏపీ హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ సీఎం జగన్ ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖ కలకలం రేపుతూనే ఉంది. లేఖ రాయడం ఓ ఎత్తయితే దాన్ని బహిర్గతం చేయడం మరో ఎత్తుగా మారింది. దీంతో జగన్ను ఈ రెండు వ్యవహారాల్లో దోషిగా నిర్దారిస్తూ పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
Recommended Video
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు జగన్ రాసిన లేఖను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ ఆయన్ను పదవి నుంచి తొలగించాలని జీఎస్ మణి, ఏఎన్నార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం ఇవాళ విచారణకు రాబోతోంది. సుప్రీంకోర్టులోని మూడు నంబర్ కోర్టులో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్ర భట్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించబోతోంది. సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ మీకోసం