మోదీ అప్పగించిన టాస్క్ కోసం చెన్నై చేరిన పవన్- సౌత్ హీరో
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా మరో అడుగు ముందుకు పడింది. దక్షిణాదిన అత్యంత ప్రాధాన్యత గల సదస్సు ఏర్పాటైంది. చెన్నై దీనికి వేదిక అయింది. సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై తిరువాన్మియూర్ లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై సదస్సు జరుగనుంది.
బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఇందులో పాల్గొనడానికి కొద్దిసేపటి కిందటే ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకి వచ్చారాయన. ఎయిర్ పోర్టులో పలువురు బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, కేఎస్ రాధాకృష్ణన్, ఎం చక్రవర్తి, అర్జునమూర్తి, అమర్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ వస్తోన్నారనే సమాచారం తెలుసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
వన్ నేషన్- వన్ ఎలక్షన్ సదస్సులో తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, అనిల్ కే ఆంటోనీ, డాక్టర్ అరవింద్ మీనన్, తమిళనాడు, కర్ణాటక బీజేపీ ఇన్ ఛార్జీ, తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, నారాయణన్ తిరుపతి ఇందులో పాల్గొననున్నారు.
అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి మధ్యంతర ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచనలు, సలహాలను అందజేస్తుంది. దానికి అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు.
ఇది అమలులోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ మేరకు ఇది వరకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు పలు సంకేతాలను కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఏడాదే ఎన్నికలు ఉంటాయని బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలూ గతంలో అంచనావేశాయి.
బీజేపీ, ఎన్డీఏ సంకీర్ణ కూటమి గెలిచే అవకాశాలు లేకపోతే తప్ప జమిలి ఎన్నికలు వాయిదా పడే అవకాశం దాదాపుగా లేవు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందనే పాయింట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులో స్పష్టంగా పొందుపరిచారు.
ఎన్నికల వాతావరణం తమకు అనుకూలంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుంటుందే తప్ప 2027లో జమిలి నిర్వహించాలని ఇదివరకే నిర్ణయం తీసుకుంది కూడా. సాధారణంగా ఆ ఏడాది ఫిబ్రవరి లేదా జూన్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ గతంలో వార్తలు వెలువడ్డాయి.
దేశంలో జమిలి ఎన్నికలు కొత్తేమీ కాదు. 1951 నుండి 1967 వరకు లోక్సభ, అన్ని రాష్ట్రా శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1951- 52లో తొలిసారిగా లోక్సభ, శాసనసభలకు మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు. 1957, 1962, 1967 నాటి ఎన్నికల వరకూ అదే సంప్రదాయం కొనసాగింది.
Join us for the “One Nation One Election” seminar in Chennai on Tomorrow May 26th, presided by our Tamil Nadu, BJP State President, Sri.@NainarBJP, with the esteemed presence of our Chief Guest, Deputy CM of Andhra Pradesh, Sri.@PawanKalyan 🇮🇳 #OneNationOneElection #ONOE pic.twitter.com/1iSEA8Tnww
— BJP Tamilnadu (@BJP4TamilNadu) May 25, 2025
కొన్ని రాష్ట్రాల శాసనసభలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి రావడం వల్ల 1968- 69 మధ్యకాలంలో జమిలికి తొలిసారిగా బ్రేక్ పడింది. 1970 నాటి లోక్సభ కూడా ముందస్తుగా రద్దయింది. ఆ తరువాత 1971లో లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి జమిలి మళ్లీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications