తేలిన అన్నదాత సుఖీభవ రెండో విడత లెక్క..! నిధుల జమకు ముహుర్తం ఫిక్స్..!
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా లబ్దిదారులకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు జమ చేసింది. దీంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. అయితే ఈ పథకంలో అర్హులై ఉండి కూడా ఈకేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ పూర్తి కాకపోవడంతో మరికొందరు మాత్రం నిధులు అందుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వం వీరికి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు వారి నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది.
అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల జమలో వివిధ కారణాలతో డబ్బులు రాని వారికి ప్రభుత్వానికి తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ వ్యవసాయ శాఖ అవకాశం కల్పించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10, 915 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే అత్యధికంగా 1290 మంది ఇలా రెండో విడతలో అన్నదాత సుఖీభవ నిధులు కోరుతూ దరఖాస్తు చేశారు.

ఆ తర్వాత స్ధానంలో విజయనగరం జిల్లా నుంచి 1111 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల నుంచి వెయ్యిలోపు దరఖాస్తుల చొప్పున వచ్చాయి. దీంతో వీటిని తాజాగా వివిధ దశల్లో పరిశీలన జరిపారు. అనంతరం మండల వ్యవసాయ అధికారుల పరిధిలో 5,377 దరఖాస్తుల్ని ఆమోదించారు. అలాగే మరో 4,261 దరఖాస్తుల్ని పెండింగ్లో ఉంచారు. చివరిగా 29 దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించారు.

పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్లో తహసీల్దార్ల పరిధిలో 827 ఉండగా, 411 దరఖాస్తుల్ని ఆమోదించి, 10 దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించారు. దీంతో రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు అర్హులైన వారి జాబితా ఖరారైనట్లయింది. వీరి ఖాతాల్లో ఈ నెలలోనే నిధులు జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వానికి వివరాలు పంపారు. ప్రభుత్వం వీటిని ఆమోదించి త్వరలోనే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేయబోతోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications