తల్లికి వందనంపై ఆగని విమర్శలు..! సర్కార్ సీరియస్ వార్నింగ్ ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడం ద్వారా ఈ ఏడాది మంచి మార్కులే సంపాదించుకుంది. గతంలో అమ్మఒడి పేరుతో జగన్ అమలు చేసిన పథకానికి మెరుగులు దిద్ది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి 13 వేల చొప్పున ఇచ్చేలా దీనికి మార్పులు చేశారు. గతేడాది అమలు చేయలేకపోయినా ఈ ఏడాది దాదాపు 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అమలు చేసింది కూటమి సర్కార్. అయితే ఇంత చేసిన ఓ విషయంలో మాత్రం విమర్శలు తప్పడం లేదు.
రాష్ట్రంలో లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా 9, 10, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు చదువుతున్న ఎస్సీ విద్యార్ధులు 3.93 లక్షల మందికి ఈ పథకం పూర్తి స్దాయిలో అమలు కాలేదు. కేంద్రం నుంచి వచ్చే స్కాలర్ షిప్ మొత్తాల్ని మినహాయించి మిగిలిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వీరికి జమ చేసింది. దీంతో విద్యార్ధులకు 5 వేల నుంచి 12 వేల రూపాయల మధ్య మొత్తాలే క్రెడిట్ అయ్యాయి. దీంతో వివాదం మొదలైంది.

తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ఎస్సీ విద్యార్ధులకు అమలు చేయకుండా మోసం చేసిందంటూ వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా హ్యాండిల్స్ లో వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇలా తల్లికి వందనం పథకంలో మొత్తం డబ్పులు రాని వానికి 20 రోజుల్లో కేంద్రం విడుదల చేసే నిధులు జమ అవుతాయని, దీంతో మొత్తం 13 వేలు లభిస్తాయని వివరణ ఇస్తోంది. దీంతో కేంద్రం నిధులు వస్తాయో రావో తెలియక ఎస్సీ విద్యార్ధుల్లోనూ అయోమయం నెలకొంది.
కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రజాదరణ పొందిన తల్లికి వందనం పథకం గురించి కొందరు కావాలని లబ్దిదారులను... ముఖ్యంగా ఎస్సీ లబ్దిదారులను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93… pic.twitter.com/b1RaDhKqvW
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 25, 2025
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివరణతో కూడిన హెచ్చరికలు కూడా చేసింది. తల్లికి వందనంలో భాగంగా 3.93 లక్షల మంది ఎస్సీ విద్యార్ధులకు కేంద్రం 20 రోజుల్లో నిధులు జమ చేస్తుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ప్రభుత్వం రెండోసారి వివరణ తర్వాత అయినా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి.
-
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications