AP Pensions: ఏపీలో ఏప్రిల్ నెల పెన్షన్లు ఆలస్యం- కారణమిదే..!
ఏపీలో ప్రతీ నెలా ఒకటో తేదీన వైసీపీ ప్రభుత్వం ఠంచనుగా పంపిణీ చేస్తున్న సామాజిక పెన్షన్లు ఈసారి మాత్రం ఆలస్యం కాబోతున్నాయి. ఈసారి పెన్షన్లు ఆలస్యం అవుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన చేసింది. సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ మేరకు పెన్షన్ల ఆలస్యంతో పాటు దానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు. దీంతో ఈసారి పెన్షన్ల కోసం రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్దితి.

ఏపీలో ఏప్రిల్ నెల ఒకటో తేదీన ఇవ్వాల్సిన వైఎస్సార్ ఆసరా పెన్షన్లు ఆలస్యం కాబోతున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణు ఇవాళ ప్రకటించారు. అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 1న సెలవు ప్రకటించడం, ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం రావడమే కారణంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3న మాత్రం యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు, పెన్షనర్ల పెన్షన్లు ఆలస్యమవుతున్నా సామాజిక పెన్షన్లు మాత్రం ఠంచనుగా ప్రతీ నెలా ఒకటో తేదీనే వారికి ఇంటి వద్దే అందుతున్నాయి. కానీ ఈసారి మాత్రం బ్యాంకు కారణాలతో పెన్షన్ల ఆలస్యం జరుగుతోంది. దీంతో పెన్షనర్లు ఈ విషయాన్ని అర్దం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఏప్రిల్ నెలకు మాత్రమే ఇలా ఆలస్యం అవుతుందని, మే నుంచి తిరిగి ఎప్పటిలాగే ఒకటో తేదీకే పెన్షన్ అందిస్తామని చెబుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications