ఏపీ గవర్నర్ రిపబ్లిక్ డే ప్రసంగం-చేతల ప్రభుత్వమని వ్యాఖ్య-రాజధానులపై అదే మౌనం..

ఏపీలో వైసీపీ సర్కార్ గత మూడున్నరేళ్లలో చేపట్టిన సంక్షేమం, పాలనా సంస్కరణలపై ఇవాళ రిపబ్లిక్ డేలో గవర్నర్ ప్రసంగం సాగింది. అయితే మూడు రాజధానుల ప్రస్తావన మాత్రం ఎక్కడా కనిపించలేదు.

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజ్యాంగం ఏర్పడి నేటికి 73 ఏళ్లయిందని, ఇది అత్యున్నత స్థాయి మానవీయ విలువలతో నిండి ఉందని గవర్నర్ తెలిపారు. బాబురాజేంద్ర ప్రసాద్, బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి దిగ్గజాల పర్యవేక్షణలో రాజ్యాంగం రూపుదిద్దుకుందన్నారు. 73 ఏళ్ల రాజ్యాంగ సారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గడచిన 43 నెలల పాలనలో నిజమైన అక్షరాస్యతతో అమలు చేస్తోందన్నారు.

ఏపీలో చేతల ప్రభుత్వం

ఏపీలో చేతల ప్రభుత్వం

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని దేశంలో ఎక్కడా లేని నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని కేవలం 43 నెలల్లోనే తీసుకొచ్చామని గవర్నర్ తెలిపారు. గ్రామ / వార్డు సెక్రటేరియట్‌లు, వాలంటీర్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడానికి ఒక ముఖ్యమైన అంశమన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశం కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. అట్టడుగు వర్గాల భవితవ్యాన్ని మార్చడానికి ఇంతకు ముందు ఎలాంటి ప్రయత్నం జరగలేదని గ్రహించిన ప్రభుత్వం.. ప్రత్యక్ష ప్రయోజన బదిలీని (డీబీటీ)ని ప్రారంభించిందన్నారు. దీని ద్వారా రూ. 1.82 లక్షల కోట్లు అత్యంత పారదర్శకంగా ఇప్పటి వరకు లబ్ధిదారులకు చేరాయన్నారు. కోవిడ్ కష్టకాలంలో, ఆర్థికంగా ఒత్తిళ్లున్నా, ఆపద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా ఆర్థిక సహాయం అందించిందన్నారు.

విద్యారంగంలో

విద్యారంగంలో

రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద విద్యార్ధుల తల్లులకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తోందని గవర్నర్ తెలిపారు. ఇప్పటి వరకు రూ.19,617 కోట్లను నేరుగా 44.49 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందన్నారు. జగనన్న గోరు ముద్ద పథకంలో పిల్లలకు మంచి నాణ్యమైన, రుచికరమైన, పోషకమైన మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని "జగనన్న గోరుముద్ద" పేరుతో 2020లో ప్రారంభించినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఏడాదికి 1800 కోట్ల చొప్పున ఇప్పటి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం 3,239 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి విద్యార్థికి ద్విభాషా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, కుట్టు ఛార్జీలతో కూడిన 3 జతల యూనిఫాం, ఒక జత షూలు, రెండు జతల సాక్స్, బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీతో కూడిన కిట్‌ను ఉచితంగా అందజేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. జగనన్న విద్యా దీవేన ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి క్రమం తప్పకుండా ఫీజుల్ని రీయింబర్స్ చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద 24,74,544 మంది లబ్ధిదారులకు రూ.9,051 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అలాగే సీబీఎస్ఈ సిలబస్‌తో కూడిన ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నామన్నారు. మరోవైపు డిజిటల్ లెర్నింగ్ లో భాగంగా పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్‌లుగా మార్చేందుకు ముందుకు సాగుతూ, ఉత్తమ పాఠశాలలతో సమానంగా మెరుగైన విద్యను అందించే దిశగా డిజిటల్ లెర్నింగ్ విధానం ప్రవేశపెట్టామన్నారు. 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు రూ.778 కోట్ల విలువైన ప్రీలోడెడ్ బైజూ కంటెంట్‌తో రూ.688 కోట్ల విలువైన 5,18,740 TABలు పంపిణీ చేశామన్నారు.

వ్యవసాయంలో ఏపీ

వ్యవసాయంలో ఏపీ

మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉన్నందున ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని గవర్నర్ తెలిపారు. ఇ-క్రాప్ బుకింగ్ ద్వారా ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం "ఇ-క్రాప్ బుకింగ్" ద్వారా రైతులు అన్ని పంట పొలాల్లో విత్తిన విస్తీర్ణం యొక్క డిజిటల్ రికార్డింగ్‌ను చేపడుతోందన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, YSR రైతు భరోసా - PM కిసాన్, వైఎస్సార్ ఉచిత పంట బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు అందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ సంచారా పశు ఆరోగ్య సేవ ద్వారా 175 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లతో డాక్టర్ YSR సంచర పశు ఆరోగ్య సేవ యొక్క సేవలు 19 మే, 2022న రూ.133.58 కోట్లతో ప్రారంభించామన్నారు.

వైద్యారోగ్యంలో ఏపీ

వైద్యారోగ్యంలో ఏపీ

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క నాణ్యత పాలనను నిర్వచిస్తుందని, మానవ అభివృద్ధి సూచికకు అత్యంత ముఖ్యమైన అంశం ఇదేనని గవర్నర్ తెలిపారు. 10,032 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆసుపత్రులు, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్ ఆసుపత్రులు, 15 స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇవి కాకుండా 542 అర్బన్ పిహెచ్‌సిలు రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య సౌకర్యాన్ని కల్పిస్తున్నాయన్నారు. ప్రతి మండలంలో 2 పిహెచ్‌సిలు ఉండేలా ప్రభుత్వం కొత్తగా 88 పిహెచ్‌సిలను మంజూరు చేసిందన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ మరియు నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల తరహాలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి, నాడు-నేడు కింద అన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థలలో సౌకర్యాలు అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉండకూడదనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటి వరకు 3899 స్పెషలిస్టులు, 2088 మెడికల్ ఆఫీసర్లు, 5777 స్టాఫ్ నర్సులు, 10032 MLHPS, 13540 ANMలు, 13303 పారామెడికల్ మరియు వివిధ ఆరోగ్య సదుపాయాలలో సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 48,639 పోస్టులను నియమించారని గవర్నర్ తెలిపారు. 2019 నుండి ఆరోగ్యశ్రీ పథకం కింద వార్షిక ఆదాయ అర్హత సీలింగ్ పరిమితిని రూ. ఒక్కో కుటుంబానికి 5 లక్షలకు పెంచడమే కాకుండా, వెయ్యి రూపాయలు దాటిన అన్ని చికిత్సల్నీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చారన్నారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం జరగాల్సిన తల్లులు సురక్షిత ప్రసవం తర్వాత ఇంటికి తిరిగి వచ్చే వరకు వారి ఇంటి నుండి ఆసుపత్రికి మరియు ఆసుపత్రి నుండి ఇంటికి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.

సంక్షేమంలో ఏపీ

సంక్షేమంలో ఏపీ

నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, మహిళా సాధికారత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపునేస్తం, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వంటి కార్యక్రమాలకు వేల కోట్ల నిధుల్ని వెచ్చిస్తున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం కూడా అమలుచేస్తున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గత మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అపూర్వమైన సంక్షేమం మరియు అభివృద్ధిపై జనాన్ని స్వయంగా కలిసి ఎమ్మెల్యేలు ఈ వివరాలు అందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. అలాగే నవరత్నాలు పెదలందరికి ఇళ్లు పథకం, వైఎస్ఆర్-జగనన్న లేఅవుట్లలో కింద అందరికీ 2024 కల్లా ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+