ఇంట్లో ఎలుక ఉంటే ఇల్లు తగలబెడతారా? సర్కార్పై భగ్గుమన్న కన్నా
రాజధాని మార్పు అనేది ఇంట్లో ఎలుక ఉంటే ఇల్లు తగులబెట్టినట్టు ఉందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఏపీ ప్రభుత్వం సహేతుక కారణం చెప్పడం లేదన్నారు. ఓ సారి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మరోసారి ఎడారి అవుతోందని, అడవీలో ఉందని, ముంపునకు మునిగిపోతుందని, చివరి లక్ష కోట్లు అని చెప్పి గందరగోళానికి గురిచేస్తుందన్నారు. రాజధాని ఇందుకోసం మారుస్తున్నామని ఏపీ సీఎం జగన్ గానీ మంత్రులు గానీ ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.

బీజేపీ వెల్కం..
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు బీజేపీ స్వాగతిస్తోందని కన్నా చెప్పారు. ఇప్పుడే కాదు గతంలో చంద్రబాబు నాయుడుకు కూడా లేఖ రాశామని గుర్తుచేశారు. జీవీఎల్ నరసింహారావు, మురళీధర్ రావు కలిసి.. చంద్రబాబును కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఓకే కానీ.. డెవలప్ పేరుతో పరిపాలనను వికేంద్రీకరించడాన్ని మాత్రం బీజేపీ తప్పుపడుతోందని స్పష్టంచేశారు. సచివాలయాన్ని విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జగన్ చేస్తున్న అరాచక పాలనపై ప్రజాక్షేత్రంలో పోరాడుతామని చెప్పారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
రాజధానిని మార్చబోమని ఎన్నికల ముందు చెప్పినా జగన్.. అధికారం చేపట్టాక మారుస్తూ మాట తప్పారని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా ప్రజా వ్యతిరేకత వచ్చిందని.. ఇప్పుడు కూడా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కూడా అదే పరిస్థితి ఏర్పడబోతుందని జోస్యం చెప్పారు.

పులివెందులకు 1400 కోట్లా..?
సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకబడిన జిల్లాలపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పులివెందులకు 1400 కోట్లు కేటాయించి, వెనకబాటుకు గురైన జిల్లాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

క్లారిటీ ఉంది..
రాష్ట్ర పరిధిలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. రాజధాని మార్పు అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పారు. ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే తప్ప.. సుమోటోగా స్పందించే పరిస్థితి ఉండబోదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా అరాచక పాలన కొనసాగిందని చెప్పారు. బీజేపీ-జనసేనలో కూడా రాజధాని అంశం సహా ఇతర అంశాలపై క్లారిటీతో ఉన్నాయని చెప్పారు.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications