ఏప్రిల్ 20 నుండి 24 వరకు ఏపీ ఎంసెట్: కాకినాడ జేఎన్టీయూకు బాధ్యత: ఇతర సెట్ ల షెడ్యూల్ విడుదల..!
ఏపీ ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి కీలకమైన వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం కోసం ..సెట్ పరీక్షల షెడ్యూల్ విడదుల చేసింది. లక్షలాది మంది విద్యార్ధులు రాసే ఏపీ ఎంసెట్ పరీక్షను 2020, ఏప్రిల్ 20,21,22,23, 24 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. గత ఏడాది లాగానే ఈ సారి కూడా ఎంసెట్ పరీక్ష నిర్వహణా బాధ్యతను కాకినాడ జేఎన్టీయూకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఏపీ ఈ సెట్ ను ఏప్రిల్ 30, 2020 న నిర్వహించనున్నారు.
ఏపీ ఐ సెట్ పరీక్ష నిర్వహణ తేదీ ఏప్రిల్ 27 , 2020 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఏపీపీజీఈ సెట్ పరీక్షను 2020, మే లో 2,3,4 తేదీల్లో నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎడ్ సెట్ ను మే 9న, ఏపీ లా సెట్ ను మే 8న నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

ఎంసెట్ పరీక్ష నిర్వహణా బాధ్యతలను జేఎన్టీయూ..కాకినాడకు అప్పగించిన ప్రభుత్వం.. ఈసెట్ నిర్వహణ ను అనంతపురం జేఏన్టీయూకు అప్పగించింది. ఏపీ ఐ సెట్ ఈ ఏడాది ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించారు. ఏపీపీజీఈ సెట్ నిర్వహణ గతంలో లాగానే ఇప్పుడూ ఆంధ్రా యూనివర్సిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎడ్ సెట్ నిర్వహణ బాధ్యతలు గతంలో ఎస్వీ యూనివర్సిటీకి ఇవ్వగా..ఈ సారి ఆంధ్రా యూనివర్సిటీకి అప్పగించారు.
మరో కీలక పరీక్ష అయిన ఏపీ లా సెట్ ను గత ఏడాది లాగానే ఈ సారి కూడా ఎస్కే యూనివర్సిటీకే నిర్వహణా బాధ్యతలు కేటాయించారు. ఏపీ ఆర్ సెట్ ను ఎస్వీ యూనివర్సిటీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగానే ఈ పరీక్షల తేదీలు ప్రకటించటం ద్వారా సిద్దమయ్యేందుకు విద్యార్ధులకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేసారు.
-
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
LPG: ఏపీలో గ్యాస్ పరిస్ధితి ఇదీ- తేల్చేసిన చంద్రబాబు..! -
కొత్త ఇళ్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్- అర్హుల జాబితా సిద్దం, పంపిణీ ఇలా..!! -
‘మెగా’ గుడ్ న్యూస్: ఇక 21 రకాల వైకల్యాలకు ‘సదరం’ సర్టిఫికెట్లు! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఏపీకి ఈ బెనిఫిట్.. ఫోకస్ చెయ్యమన్న సీఎం చంద్రబాబు -
రైతుబజార్ కూరలు ఇక ఇంటికే, ఇలా చేస్తే చాలు- అక్కడి ధరలకే అన్ని ఉత్పత్తులు..!! -
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! -
AP EAPCET 2026: ఏపీ ఈఏపీసెట్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్-గడువు పెంపు..!












Click it and Unblock the Notifications