ఏపీలో రేషన్ కార్డు దారులకు భారీ గుడ్ న్యూస్, ఇక నుంచి కొత్తగా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త ప్రణాళికల అమలుకు సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం రేషన్ పంపిణీలో పలు రకాల మార్పులు తీసుకొచ్చింది. లబ్దిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తోంది. రేషన్ దుకాణాల వేళల్లో నూ మార్పులు చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ షాపులు అందుబాటులో ఉంచేలా డిసైడ్ అయింది. ఇదే సమయంలో రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు తుది కసరత్తు చేస్తుంది.
ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థలో కొత్త మార్పులకు సిద్దమైంది. ఇప్పటికే రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను తీసుకొచ్చారు. కాగా, ఇప్పటి వరకు నిర్దేశిత సమయాలకే పరిమితమైన రేషన్ సరఫరా ఇక రోజంతా అమలు చేసేందుకు సిద్దమైంది. అదే సమయంలో చౌక ధర దుకాణా లను మినీమాల్స్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందు కోసం తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసారు. ప్రస్తుతం ఏపీలోని రేషన్ దుకాణాల్లో ప్రతి నెలా 1-15 వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు బియ్యంతో పాటుగా ఇతర నిత్యావసరాలు ఇస్తున్నారు. ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగా దుకాణాలు నిర్వహించట లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ తీసినా సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో, వీటికి చెక్ పెడుతూ ప్రభుత్వం కొత్త నిర్ణయాల అమలుకు సిద్దమైంది. మినీమాల్స్ విధానంలో రోజంతా దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. మినీమాల్స్లో అన్ని నిత్యావసరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ వ్యవసాయ కో-ఆపరేటివ్ సొసైటీ, గిరిజన కార్పొరేషన్ నుంచి చౌకధర దుకాణాలకు ఆయా నిత్యావసరాలను సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే.. ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే కొనుగోలు చేయాలా అనేది తెలియాల్సి ఉంది. అదే విధంగా సదరు నిత్యావసరాలపై లబ్ధిదారులకు రాయితీ ఉంటుందా లేదా అన్న అంశాలపై కుడా స్పష్టత రావాల్సి ఉంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటు ఈ నిత్యావసరాలన్నీ పెట్టేందుకు అనువుగా ఒక్కో నగరంలో 15 చొప్పున మొత్తం 75 దుకాణాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటించనున్నారు.
-
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications