కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - ముహూర్తం ఫిక్స్..!!
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్దమైంది. 2024 ఎన్నిక వేళ ఇచ్చిన హామీ మేరకు అమలు కార్యాచరణ సిద్దం చేసింది. నాడు ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా కొన్ని పథకాలను ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. కాగా.. ఇతర హామీల అమలు దిశగా కసరత్తు వేగ వంతం చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు హామీ అమలు కు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారికంగా స్పష్టత ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ తో పాటుగా మరిన్ని హామీలు ఇచ్చింది. అందు లో భాగంగా ఏపీలో అన్న క్యాంటీన్లపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలు, నగరాల్లో మాత్రమే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయగా.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని ప్రారంభించనుంది. మండల కేంద్రాల్లో కొత్తగా అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఉగాది వేళ గ్రామనీ ప్రాంతాల్లో ముందుగా 75 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రస్తుతం రూ 5 కే టిఫిన్, నాణ్యమైన భోజన సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. వీటి ఏర్పాటు పైన అసెంబ్లీ వేదికగా మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 205 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసారు. కాగా.. వీటిని ఇప్పటి వరకు 3.07 కోట్ల మంది వినియోగించుకున్నారు.

ఉగాది నుంచి ప్రారంభించేలా ప్రణాళికలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను పట్టణాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు నిర్ణయించారు. తొలుత సంక్రాంతి సమయంలోనే రూరల్ ఏరియా లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని భావించారు. అయితే.. పనులు పూర్తి కాక నిర్ణయం అమలు వాయిదా పడింది. ఇప్పుడు ఉగాది వేళ గ్రామీణ ప్రాంతాల్లో 75 అన్నా క్యాంటీన్లను అందు బాటులోకి తెస్తున్నారు. దశల వారీగా మరిన్ని పెంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. ఇందు కోసం ప్రతీ క్యాంటీన్ కోసం రూ 65 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఉగాది నుంచి వీటిని ప్రారంభించటం ద్వారా ఆ ప్రాంత పేదలకు మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications