ఆతిథ్య రంగానికి కేంద్రంగా అమరావతి : 18న ఉన్నత స్థాయి సమావేశం
అమరావతి : నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని ఆతిథ్య రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 18న దీనికి సంబంధించిన ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఏపీ సీఎం చంద్రబాబు సహా ప్రముఖ హోటల్ యాజమాన్యాల ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.
తాజాగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సమావేశంలో భాగంగా ఆతిథ్య రంగానికి అనుకూలంగా అమరావతీని తీర్చిదిద్దడంలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించనున్నారు. ప్రపంచ స్థాయి నగరాలకు ధీటుగా ఉన్నత హంగులతో హోటళ్లను, కన్వెషన్ సెంటర్లను ఏర్పాటు చేసే విషయమై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

అమరావతికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి సదస్సులు, సమావేశాలకు అనుకూలంగా అమరావతిని తీర్చిదిద్దాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అజయ్ జైన్ తెలిపారు. 18న జరగబోయే సమావేశం కోసం వివిధ దేశాల్లో ప్రముఖంగా ఉన్న హోటల్ యాజమాన్యాల ప్రతినిధులను సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) ఆహ్వానించింది. కాగా, ఐటిసి హోటళ్లు, లీలా హోటళ్లు, మహేంద్ర రిసార్టులు, హాలిడే ఇన్, హిల్టన్ హోటళ్ల ప్రతినిధులు సహా మరికొన్ని ప్రముఖ హోటళ్ల ప్రతినిధులు సదస్సులో పాల్గొననున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications