ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు - ఐఆర్, బకాయిలపై కీలక నిర్ణయం..!?
ఏపీ ప్రభుత్వం మరోరసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్దమైంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమ డిమాండ్ల కోసం ఉద్యోగ సంఘాల నిరసనకు నిర్ణయించారు. గతంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం పైన ఉద్యోగ సంఘాలు పోరాటం చేయాలని నిర్ణయించారు. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఆహ్వానించింది. ఐఆర్ తో పాటుగా బకాయిల చెల్లింపు పైన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం చర్చలు
ఎన్నికల వేళ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. పీఆర్సీ సహా పెండింగ్ డీఏలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ అహ్వానించింది. పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 12 పీఆర్సీకి ఇంకా ప్రతిపాదనలు స్వీకరించకపోవటంతో ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగులకు ఐఆర్
ఏపీ ఎన్జీవో నేతృత్వంలోని ఏపీజేఏసీ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి అందజేసింది. ఈ నెల 27 తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ఏపీజేఏసీ స్పష్టం చేసింది. చర్చల వేళ మధ్యంతర భృతికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. చలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు ఉద్యోగులు, పెన్షనర్లకు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. పెండింగ్ బకాయిల గురించి గత సమావేశంలో ప్రభుత్వం తమ ఆలోచన వెల్లడించింది. ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ బకాయిల చెల్లింపు పైన ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయాలు
ఇదే సమయంలో 12వ పీఆర్సీ నియమించిన ప్రభుత్వం ఇప్పుడు వేతన సవరణ సంఘం కోసం కార్యాలయం, తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ డీఏల విషయంలో గతంలోనే హామీ ఇచ్చినా అమలు చేయకపోవటం పైన ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో..ఈ రోజు జరిగే చర్చల్లో డీఏతో పాటుగా ఐఆర్ పైన ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ వస్తుంది..ఐఆర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఉత్కంఠతకు కారణమవుతోంది.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications