ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..!
ఏపీలో విద్యార్ధులకు ప్రభుత్వం (ap govt)ఇవాళ మరో శుభవార్త చెప్పింది. కౌమార దశలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్ ను ప్రారంభించింది . ఆరోగ్య సంరక్షణ, శారీరక మార్పులు, మానసిక వికాసం, హెచ్ఐవీ వంటి అంశాలపై ఈ పోర్టల్ లో సమాచారం పొందుపరిచింది. ఇందులోనే ఈ-లెర్నింగ్ ద్వారా నేర్చుకోవడానికి వీలుగా పలు అంశాల్ని అందుబాటులో ఉంచారు. ఏపీఎస్ హెచ్ డబ్ల్యూపీ' పేరుతో పోర్టల్ (apshwp.ap.gov.in) రూపొందించినట్లు వైద్యమంత్రి వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా 13-19 ఏళ్ల మధ్య ఉన్న కౌమార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'ఆంధ్రప్రదేశ్ స్కూలు హెల్వెల్నెస్ ప్రోగ్రాం' కింద డిజిటల్ పోర్టల్ ను తయారుచేశారు. వైద్య సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న ప్రభుత్వం తాజాగా ప్రివెన్షన్ విధానంలో విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం, వ్యసనాల దుష్ప్రభావాలు మానసిక ఉల్లాసం, మంచి పద్ధతులు తెలుసుకునేలా అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానంతో ఈ వెబ్ సైట్ రూపొందించింది.

ఇందులో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, మత్తు పదార్ధాల వినియోగానికి దూరంగా ఉండడం, లింగ సమానత్వం, హెచ్ఐవీ, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండటం, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల సురక్షిత వినియోగం వంటి అంశాలపై సెల్ఫ్ లెర్నింగ్ లో నేర్చుకునేలా 'ఏపీఎస్ హెచ్ డబ్ల్యూపీ' కొత్త పోర్టల్ ను అందుబాటులోనికి తెచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర కిశోర ఆరోగ్య కార్యక్రమం* కింద 'డిజిటల్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్' కింద రూపొందించిన ఈ పోర్టల్ ప్రాధాన్యం గురించి విద్యార్థులకు వివరించేలా స్కూల్స్, కాలేజీల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లలో ఎంపిక చేసిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ వెబ్ సైట్ లలో విద్యార్థులందరికీ ఉపయోగపడేలా 11 ప్రధాన అంశాల సమాచారం ఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండాలి? నైతిక విలువలు-ప్రాధాన్యం, పౌష్టికాహారం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర అంశాల గురించి 15 నిమిషాలలోపు ఉండేలా వీడియోలను తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంచారు. విద్యార్థులు పరస్పరం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా వివిధ అంశాలపై వీడియో పాఠాలను రూపొందించారు. ఉదాహరణకు బాలికల రుతుక్రమం, వ్యక్తిగత పరిశుభ్రత, మత్తు పదార్థాల వాడకంతో వచ్చే ఆరోగ్య క్షీణత గురించి వీడియో పాఠాల్లో పేర్కొన్నారు. అలాగే మితిమీరిపోతున్న సోషల్ మీడియా ప్రభావంవల్ల ఎటువంటి కష్టాలు, నష్టాలు ఎదురవుతాయో తెలిపే విధంగా వీడియో పారాలు పోర్టలులో ఉన్నాయి. ఆటల రూపంలో ఈ-లెర్నింగ్, క్విజ్ పోటీల్లో పాల్గొనడం, ఆన్లైన్ పరీక్షలు రాసిన వారికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సర్టిఫికెట్లు కూడా ఇస్తారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
తెలంగాణా విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు















Click it and Unblock the Notifications