ఏపీ హైకోర్టు జడ్డీల బదిలీ చిచ్చు- గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి లాయర్ల ఫిర్యాదు!
ఏపీ హైకోర్టులో ఇద్దరు సీనియర్ జడ్డీలు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్ లను వేర్వేరు హైకోర్టులకు బదిలీ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో విధుల్ని బహిష్కరించి అడ్వకేట్స్ జేఏసీ నిరసనలు చేపడుతోంది. ఇవాళ విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జేఏసీ నేతలు కలిశారు.
హైకోర్టు జడ్డీల బదిలీ ఉత్తర్వులు వెలువడిన తర్వాత నిరసనలు చేపడుతున్న న్యాయవాదుల జేఏసీ ఇవాళ రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ తో భేటీ అయింది. ఈ భేటీలో గవర్నర్ కు తాజా పరిస్ధితుల్ని వివరించిన లాయర్లు.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ బదిలీల్ని ఆపాలని కోరారు. ఎల్లుండి ఆదివారం రాష్ట్రపతి ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము విజయవాడలోని రాజ్ భవన్ కు రానున్నారు. ఈ సమయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ద్వారా హైకోర్టు జడ్జీల బదిలీల్ని ఆపాలని లాయర్లు కోరారు.

లాయర్ల విజ్ఞప్తికి గవర్నర్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని జేఏసీ నేత, లాయర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.న్యాయవ్యవస్థ ఎలాంటి ప్రభావానికి గురి కాకుండా స్వేచ్ఛగా పనిచేయాలని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ కు కూడా చెప్పామన్నారు.
న్యాయవ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులు న్యాయం చేయాలంటే న్యాయవాదుల సహకారం ఉండాలని, న్యాయ వ్యవస్థ అంటే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు కూడా అని ఆయన తెలిపారు. న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు మేరకు బదిలీ చేయడం సరికాదన్నారు. దీనిపై తమ ఫిర్యాదు తీసుకున్న గవర్నర్ రాష్ట్రపతితో మాట్లాడతానని హామీ ఇచ్చారన్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications