డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు- ఆస్పత్రిలోనే వాంగ్మూలం
విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. డాక్టర్ సుధాకర్ సమాజంలో తన హోదాను మర్చిపోయి బహిరంగంగా ముఖ్యమంత్రి, ప్రధాని మంత్రిని, అడ్డొచ్చిన పోలీసులను దుర్భాషలాడినట్లు పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ముందుగా ఆయన వాంగ్మూలం నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విశాఖ సెషన్స్ న్యాయమూర్తిని రేపు సాయంత్రం లోపు సుధాకర్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకోవాలని ఆదేశించింది.
విశాఖ నగరంలో లాక్ డౌన్ అమలవుతుండగానే మద్యం సేవించి ఓ కారులో వచ్చి రోడ్డుపై తనను అడ్డుకున్న పోలీసులపై దుర్భాషలాడినట్లు డాక్టర్ సుధాకర్ పై కేసులు నమోదయ్యాయి. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు డా సుధాకర్ పై 353, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందే ఆయన మానసిక పరిస్ధితి సరిగా లేదన్న కారణంతో అధికారులు విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
IBM వచ్చేసింది: వైజాగ్ ఆఫీస్ ఇదే! మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్. -
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications