విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ పిటిషన్... కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం(ఏప్రిల్ 15) న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరామని విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది.
హైకోర్టులో పిటిషన్ కన్నా ముందు రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధునిక యంత్ర పరికరాలతో,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నడుస్తోందని గుర్తుచేశారు. పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.43,700 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ)ని ఎన్ఎండీసీలో విలీనం చేయాలని... ఆపై వీఎస్పీ-ఎన్ఎండీసీని సెయిల్లో విలీనం చేయడం ద్వారా మెగా స్టీల్ దిగ్గజంగా మారుతుందని చెప్పారు. మెగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ముడి వస్తువుల ఖర్చు,ఉత్పత్తి వ్యయం తగ్గుతుందన్నారు. రాష్ట్రపతి పేరిట ఉన్న స్టీల్ ప్లాంట్ భూమిలో 16,782 ఎకరాలను ప్లాంట్కు బదలాయించడం మరో ప్రత్యామ్నాయమని సూచించారు. దీనివల్ల తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకొస్తాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ మనుగడ సాధించాలంటే తక్షణం రూ.5వేల కోట్లు అవసరమని... దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్లాంట్ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆ మొత్తం సమకూరుతుందని సూచించారు.
గుజరాత్లో పటేల్ విగ్రహానికి వినియోగించిన 3200 టన్నును విశాఖ స్టీల్ ప్లాంట్లోనే తయారుచేశారని లేఖలో లక్ష్మీనారాయణ కేంద్రానికి గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు 18 వేల టన్నుల స్టీల్ను,నాగ్పూర్-ముంబై జాతీయ రహదారి కోసం 8500 టన్నుల స్టీల్ను విశాఖ స్టీల్ ప్లాంటే ఉత్పత్తి చేసిందని గుర్తుచేశారు.
Recommended Video
కాగా,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ,జనసేన మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కార్మికుల ఆందోళనకు మద్దతుగా నిలిచాయి. ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మికులు,రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నప్పటికీ... కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ ఆగదని ఇప్పటికే స్పష్టం చేసింది. కార్మికులు మాత్రం ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గేదాకా తమ పోరాటం ఆగదని చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications