నాగార్జునసాగర్ నీటిని విడుదల చెయ్యాలని తెలంగాణాను ఆదేశించండి: కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ!!
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల నుంచి ఏడు టీఎంసీల నీటిని అత్యవసరంగా విడుదల చేయాలని ఏపీ జల వనరుల శాఖ రాసిన లేఖలో పేర్కొంది. నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాలువ నుంచి ఆరు టీఎంసీలు, ఎడమ కాలువ నుంచి ఏపీ సరిహద్దు ప్రాంతాలకు ఒక టిఎంసి నీటిని విడుదల చేసేలా తెలంగాణ అధికారులను ఆదేశించాలని లేఖలో పేర్కొంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో ఇప్పటికీ ఇబ్బందులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం ఆరోపణలు చేసుకుంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖలు రాయడం పరిపాటిగా మారింది. ఇక తాజాగా ఏపీ తాము రాసిన లేఖలో వేసవికాలం దృష్ట్యా తాగునీటి అవసరాలకు, ఎండిపోయే దశలో ఉన్న పంట పొలాలకు నీరు అవసరమని పేర్కొంది.

తక్షణం నాగార్జునసాగర్ హెడ్ రెగ్యులేటర్ నుండి నీరు ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరింది. అంతే కాదు కృష్ణానది బేసిన్ లో తమకు కేటాయించిన నీటిని వినియోగించుకునే వాటాలో 163 టీఎంసీల నీటిని ఏపీ ఇంకా వినియోగించుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం కేవలం 326 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవలసి ఉన్నప్పటికీ, ఇప్పటికే 417 టిఎంసిల నీటిని వాడుకుందని ఏపీ తన లేఖలో పేర్కొంది.
ఏపీ ఇప్పటివరకు తనకు దక్కిన వాటాలో 53% నీటిని మాత్రమే వినియోగించుకుందని కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు స్పష్టం చేసిన అధికారులు ఇంకా తాము ఉమ్మడి ప్రాజెక్టుల నుండి 126 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉందని లేఖ ద్వారా వెల్లడించారు. కాబట్టి తమ తక్షణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎండిపోతున్న పంటలు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఏడు టీఎంసీల నీటిని విడుదల చేసేలా ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరింది. .
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications