ఏపీ మంత్రి పేర్నినానిని స్వల్ప అస్వస్ధత- అనుచరుడి అంతిమయాత్రలో...
ఎప్పుడూ చలాకీగా కనిపించే ఏపీ సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఇవాళ అస్వస్ధతకు గురయ్యారు. తన నియోజకవర్గం మచిలీపట్నంలో అనుచరుడు భాస్కరరావును నిన్న ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి.. ఇవాళ అంత్యక్రియల్లో పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో వెంటనే అనుచరులు ఆయనకు ప్రాదమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన కాస్త కోలుకున్నారు.
నిన్న అనుచరుడు భాస్కరరావు హత్య తర్వాత తీవ్ర డిప్రెషన్ కు గురైన నాని, ఇవాళ ఉదయం నుంచి ఎలాంటి ఆహారం కూడా తీసుకోలేదు. దీంతో ఆయన డీహైడ్రేషన్ కు గురై సృహతప్పినట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మచిలీపట్నంలోని స్మశాన వాటికకు వెళ్లిన నాని.. అక్కడే స్పృహ కోల్పోయారు. వెంటనే అనుచరులు పక్కకు తీసుకెళ్లి ఆయనకు మంచినీరు ఇచ్చారు.


కాసేపటి తర్వాత ఆయనకు ప్రాధమిక చికిత్స అందించారు. నానికి అస్వస్దత వార్త తెలియగానే ఆయన అభిమానులు, కార్యకర్తలు పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications