Tdp Vs Ysrcp: ఆరోపణలు చేస్తే టీడీపీ వాళ్ల ఇంటికెళ్లి గుడ్డలూడదీసి కొడతా???
రాజకీయాల్లో మాట అనేది చాలా విలువైనది. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకుండా, ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకుండా విలువైన సందర్భాల్లో ఉపయోగిస్తే అధికారం సులువుగా దక్కించుకోవచ్చు. కానీ కాలం మారింది.. నేతలు మారారు.. ఎవరెవరో నాయకులుగా ఆయా రాజకీయ పార్టీల్లో చలామణి అవుతున్నారు. పాత తరం నేతలు అధికారంలో ఉన్నా ఆచితూచి మాట్లాడేవారు.. ప్రతిపక్షాలపై గౌరవంగా వ్యవహరించేవారు. కానీ ప్రస్తుత నాయకులు మాత్రం అధికారం చేతిలో ఉందికదా అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వైరల్ అవుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి మాటలు
ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, అటువంటివారి ఇంటికి వెళ్లి గుడ్డలూడదీసి కొడతామంటూ హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నియోజకవర్గంలో ఈసారి ఆయనపై పోటీచేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ అయితే చాలా దారుణంగా మాట్లాడారు. ఆయన మాటలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మాటలు సోషల్ మీడియాలోవైరల్ అవుతుండగానే కర్నూలు మేయర్ బీవై రామయ్య విలేకరుల వీపులు వాయగొడతామని హెచ్చరించారు. ఎండగా ఉందని ప్రజలు చెట్ల కిందకు వెళితే సామాజిక న్యాయభేరి సదస్సులో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని రాశారని, అటువంటి పత్రికలు, ఛానల్స్కు సంబంధించిన జర్నలిస్టుల వీపుల వాయగొడతామన్నారు.

రాజకీయ నాయకుల పదజాలంపై సామాజికవేత్తల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్న పదజాలంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట చాలా హుందాగా ఉండాలని, అలాగే గౌరవంగా ఉండాలని, మనం మాట్లాడే మాట ఎదుటివారికి మనపై గౌరవం కలిగించే విధంగా ఉండాలని, కానీ ఇప్పటి రాజకీయనాయకులు వాడుతున్న బాష వల్ల భావితరాలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
రాజకీయాలు హుందాగా ఉండాలని, ప్రత్యర్థులుగా పార్టీల వరకే పరిమితం కావాలని, లేదంటే చివరకు శాశ్వత శత్రువులుగా మారిపోతారంటూ ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడే నేతలను పార్టీ అధినేతలు కట్టడి చేయాలని సూచిస్తున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications