వాతావరణం చేంజ్.. మీ ఊరిలో వర్షం?

నైరుతి రుతుపవనాలు దేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. ఈరోజు (జూన్ 9, 2026) నాటికి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలలోని మిగిలిన ప్రాంతాలు, సిక్కిం మొత్తంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాల ఉత్తర పరిమితి హర్నై, సోలాపూర్, కలబురిగి, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల - చెన్నై మీదుగా కొనసాగుతోంది. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.

మరోవైపు, గత కొన్ని రోజులుగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు కొనసాగిన ఉపరితల ద్రోణితో పాటు, భారత ప్రాంతంపై ఏర్పడిన గాలుల కోత ప్రస్తుతం పూర్తిగా బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

AP Weather Forecast Heavy Rains And 50 Kmph Winds To Hit Coastal Andhra And Rayalaseema Next 3 Days

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం వాతావరణం..

రుతుపవనాల గమనం, వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు (ఈరోజు, రేపు, ఎల్లుండి) కోస్తాంధ్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రతో పాటు యానాం పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉందని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణను తాకిన రుతుపవనాలు. ఒక్కసారిగా మారిన క్లైమేట్!
తెలంగాణను తాకిన రుతుపవనాలు. ఒక్కసారిగా మారిన క్లైమేట్!

రాయలసీమ ప్రాంతంలో వాతావరణం..

రాయలసీమ ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, రేపు (బుధవారం), ఎల్లుండి (గురువారం) మాత్రం వర్షాల తీవ్రత కాస్త పెరిగి, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడవచ్చు. రాయలసీమలో కూడా రాబోయే మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే వీలుంది.

ఏపీని చుట్టేసిన రుతుపవనాలు.. తెలంగాణలోకి..
ఏపీని చుట్టేసిన రుతుపవనాలు.. తెలంగాణలోకి..

ఎండ తీవ్రత తగ్గుముఖం..

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఒక పెద్ద ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి గణనీయమైన పెరుగుదల ఉండబోదని స్పష్టం చేసింది. ఎండల తీవ్రత పెరగకుండా, ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తమ నివేదికలో పేర్కొన్నారు. కాబట్టి ఉరుములు, ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+