పురుష కమీషన్ వేయాలి:మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: టివి సీరియళ్లపై ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైలీ సీరియల్స్ ప్రభావంతో మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు.
ఇటీవలి కాలంలో కొందరు మహిళలు కూడా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని భర్తలను కిరాయి గుండాలతో హతమారుస్తున్నారని నన్నపనేని అన్నారు. మహిళలు ఈ విదమైన దారుణాలకు పాల్పడటం వెనుక కొన్ని చానల్స్లో వచ్చే డైలీ సీరియల్స్ ప్రభావం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సీరియల్స్ చాలా దారుణంగా ఉంటున్నాయన్నారు.

ఈ సీరియళ్లలో ఎక్కువగా మహిళలే విలన్ పాత్రలు పోషిస్తున్నారని...అదేంటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ సీరియళ్లలో మనుషులను ఎలా చంపాలో కూడా వివరంగా చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పురుష కమిషన్ కూడా వేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.
మరోవైపు మహిళలపై జరుగుతున్నదాడులు, డైలీ సీరియళ్ల ప్రభావం విషయమై నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఇలాంటి వాటిని సమాజం పట్టించుకోవాలని, చట్టాలు గట్టిగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాదు చట్టుపక్కల ఏం జరుగుతుందనేది ఇరుగు పొరుగువారు కూడా గమనించాలని విన్నవించారు. ఆత్మ, ప్రాణ, మాన రక్షణ కోసం మహిళలు పోలీసులు వచ్చే వరకు ఎదురు చూడకుండా తనను తాను రక్షించుకోవడం కోసం ఎదురుదాడి చేయాల్సిందేనన్నారు.
మహిళలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిపై ఖచ్చితంగా దాడి చేయాలని, తప్పనిసరిగా ఆయుధం తీసుకుని తిరగబడాల్సిందేనని నన్నపనేని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆమె వివరించారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications