Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APSRTCలో 7673 ఉద్యోగాల భర్తీ..! ప్రమోషన్లు, బకాయిలపై క్లారిటీ...!

ఏపీలో ఆర్టీసీ (APSRTC) వ్యవహారాలపై ఇవాళ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు, నియామకాలు, బకాయిల చెల్లింపులు, వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియామకాలు, సీనియారిటీ జాబితాలు, కోర్టు కేసుల స్థితిగతులపై మంత్రి విస్తృతంగా చర్చించారు.

ఈ సమీక్షలో 2025-26 డీపీసీ కింద అర్హులైన 7,514 మంది ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 20-02-2026లోపు ఎంప్యానెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. లెవెల్స్ 3, 4, 5 & ఈఈల సీనియారిటీ జాబితాల ఆధారంగా డీపీసీలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
అలాగే వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

APSRTC Seeks Permission to Fill 7 673 Posts Minister Reviews Employee Promotions and Issues

2020లో 51,488 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 44,131 మంది మాత్రమే సేవలలో ఉన్నారని, 2026, 2027, 2028 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ కానున్నారని మంత్రికి అధికారులు తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ తదితర పోస్టులకు ప్రాధాన్యతతో భర్తీ చేయాలని మంత్రి సూచించారు. అలాగే 01-01-2020 నుంచి వైద్య కారణాలతో 682 మంది ఉద్యోగులు రిటైర్ అయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగం, మిగిలిన 646 మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షల చొప్పున మొత్తం ఆర్థిక భారం రూ.96.90 కోట్లుగా అంచనా వేశారు.

APSRTC Seeks Permission to Fill 7 673 Posts Minister Reviews Employee Promotions and Issues

అలాగే ఉమ్మడి కడప ప్రాంతంలో కండక్టర్ ఖాళీలు లేకపోవడంతో 191 కారుణ్య నియామక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 28-09-2023, 29-09-2023 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైనా ఇప్పటివరకు నియామకాలు జరగలేదని, ఆర్టీసీలో పదేపదే ఫాలోఅప్ చేసినా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని అధికారులు మంత్రికి వివరించారు. కడప ప్రాంతానికి చెందిన 80 మంది కండక్టర్లు ఇతర రీజియన్లలో పని చేస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ కేడర్ల సీనియారిటీ జాబితాల పునఃపరిశీలనకు 30-01-2026న మెమో జారీ చేసినట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ మెమోల ప్రకారం సీనియారిటీ జాబితాల సమీక్ష జరుగుతుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+