పార్టీ అధికార ప్రతినిధిలా ప్రధాని: అశోక్ బాబు
హైదరాబాద్: ఎన్ని పోరాటాలు చేసైనా విభజన ఆపుతామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. విభజనకు సహకరించని ఎంపీలపై రిటైర్డ్ ఉద్యోగులను పోటీకి పెట్టి ఓడిస్తామని హెచ్చరించారు. ఈ అర్ధరాత్రి నుండి సీమాంధ్ర సమ్మెను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
సమ్మెలో పలువురు ఉద్యోగులతో పాటు రెవెన్యూ ఉద్యోగులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా విభజన ఆగి తీరాల్సిందేనని అశోక్బాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఇప్పటి వరకు విభజనలు చేశారని, ఇప్పుడు విభజన పేరు మీద నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

సమైక్యాంధ్రకు పాటుపడని నాయకులను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ఆయన చెప్పారు. అధిష్టానం కావాలో, ప్రజల ఆకాంక్ష కావాలో ప్రజాప్రతినిధులు తేల్చుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికార ప్రతినిధి మాదిరిగా ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించే రోజు మెరుపు సమ్మెకు దిగుతామని ఆయన చెప్పారు. విద్యుత్తు ఉద్యోగులతో మెరుపు సమ్మె చేయిస్తామని ఆయన చెప్పారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications