కలకలం: కోడలు తల నరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన అత్త
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కోడలి తలను అత్త నరికి చంపింది. అంతేగాక, తలను పట్టుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
అన్నమయ్య జిల్లాలోని కే రామాపురంలో ఉండే సుబ్బమ్మ.. తన కోడలు వసుంధర తల నరికి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. వసుంధరను.. పక్కా పథకం ప్రకారం సుబ్బమ్మ తన ఇంటికి భోజనానికి పిలిచింది.

అప్పటికే ఇంట్లో మాటువేసి ఉన్న కొందరితో కలిసి.. దారుణంగా తల నరికేశారు. అనంతరం తలను పట్టుకుని సుబ్బమ్మ అరకిలోమీటరు దూరంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో పోలీసులు కూడా నివ్వెరపోయారు.
Recommended Video

ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాలే హత్యకు కారణమై ఉంటాయని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications