వరి బోనస్ చెల్లింపుల్లో కీలక మార్పులు - ఇక నుంచి వీరికే..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా మఅలు చేస్తున్న సన్న వడ్ల బోనస్ పథకంలో కీలక మార్పులు చేసింది. రైతులు పండించిన సన్న రకం వడ్లకు మార్కెట్ ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తున్నారు. డబ్బును నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్ నుండి సరికొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని వ్యవసాయ శాఖ డిసైడ్ అయింది.
తెలంగాణ ప్రభుత్వం రైతులు విక్రయించిన సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం వేస్తోంది. అయితే ఈ బోనస్ అందించేందుకు పలు విధివిధానాలు మార్చింది. ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్న రకం విత్తనాలు వేసి పండించిన రైతులకు మాత్రం బోనస్ అందుతుంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 7 ప్రత్యేక రకాల సన్న వరి విత్తనాలను వేసి పండించిన రైతులకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ సొమ్ము అందుతుంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే రైతులు కొనుగోలు చేసే విత్తనాల రికార్డులు ఆన్లైన్లో కచ్చితంగా నమోదవ్వాలి. ఇందుకోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.

తాజా మార్గదర్శకాలు
కాగా, ఇక నుంచి ప్రభుత్వ అనుమతి పొందిన విత్తన డీలర్లు తాము రైతులకు విక్రయించే ప్రతి సన్న వరి విత్తన రకం వివరాలను వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు. సన్న వరి రకం విక్రయాల ఆప్షన్ను ఎంచుకుని విత్తనాలు కొనుగోలు చేసిన రైతు పేరు, తండ్రి పేరు, విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నంబర్, సీడ్ ప్యాకెట్ సైజ్, కొనుగోలు చేసిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసారు. వానాకాలం సీజన్లో విక్రయించే విత్తనాలకు మాత్రమే ఈ డిజిటల్ విధానం అమల్లో ఉంటుంది. ర్ఎన్ఆర్-15048, బీపీటీ-5204, కేఎన్ఎం-1638, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యుజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాలు పండించిన రైతులకు మాత్రమే బోనస్ అందిస్తారు. అక్రమాల నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications