అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్
లక్నో: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500 ఏళ్ల తర్వాత దేశ ప్రజల సుదీర్ఘకల సాకారం అవుతోందని అన్నారు.
రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగస్వామినయ్యే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. కాగా, సోమవారం తెల్లవారుజామున లక్నో నుంచి అయోధ్యకు బయల్దేరి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే.

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. తొలుత రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి ప్రధాని మోడీ దర్శనం చేసుకోనున్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు. అయితే, ప్రాణప్రతిష్ట రోజున సామాన్య భక్తులకు ఆలయంలోకి అనుమతి లేదు. జనవరి 23 నుంచి ప్రజలందరికీ బాల రాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు.
#WATCH | Uttar Pradesh: Jana Sena chief Pawan Kalyan arrives in Lucknow, ahead of the Ayodhya Ram Temple Pranpratishtha ceremony that will be held tomorrow.
— ANI (@ANI) January 21, 2024
He says, "This has been a long-cherished dream of the people and after 500 years, it is finally coming into reality, we… pic.twitter.com/JEY4QnO6qn
కాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్స వేడుకకు దేశంలోని సుమారు 4 వేలకుపైగా వివిధ రంగాల ప్రముఖులు, స్వామిజీలు, ఆధ్యాత్మిక వేత్తలకు రామ మందిర ట్రస్ట్, వీహెచ్పీ ఆహ్వానాలు పంపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. వేలాది మంది భక్తులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications