గడ్కరీకు బాలకృష్ణ విజ్ఞప్తి, 20 కాదు.. 45 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయం
విజయవాడ/ఢిల్లీ: రహదారుల విషయంలో వెనుకబడిన అనంతపురం జిల్లాకు తగిన ప్రాధాన్యం టిడిపి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి గురువారం నాడు విజ్ఞప్తి చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
ఈ రోజు నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురంలో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలకు హాజరుకావాలని నితిన్ గడ్కరీని బాలకృష్ణ ఆహ్వానించారు.
అదే సమయంలో వెనుకబడిన అనంతపురం జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలన్న తన విజ్ఞప్తికి గడ్కరీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు తగిన నిధులు ఇవ్వాలని కోరానని తెలిపారు.

45 ఏకరాల్లో తాత్కాలిక సచివాలయం
తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గురువారం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత నిర్ణయించినట్లుగా 20 ఎకరాల్లో కాకుండా 45.12 ఎకరాల్లో సచివాలయం నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మించనున్నారు.
సీఆర్డీఏ వేదిక ఆధారంగా 45 ఎకరాల్లో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 27.08 ఎకరాల్లో సమీకృత ప్రభుత్వ భవన సముదాయం, 18.47 ఎకరాల్లో ప్రజా సదుపాయాల భవనాలను నిర్మించనున్నారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications