Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్..ఢిల్లీలో మారుతున్న లెక్కలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కీలక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ పంపిన ప్రతిపాదనలను తిప్పి పంపింది.

దీంతో బనకచర్ల కాలువల సామర్థ్యం పెంపు పనులను చేపట్టాలన్న చంద్రబాబు ప్రభుత్వ ఆశలకు అడ్డుకట్ట పడింది. పర్యావరణ అనుమతులు పొందడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రం తేల్చి చెప్పింది.

Banakacherla project has no permission - Central Government

ఈ నిర్ణయం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిర్యాదు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టును అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుగా పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

ఆ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. సముద్రంలో కలిసే నీళ్లను వినియోగించుకుంటే తప్పు ఏముందని ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే బనకచర్ల ప్రాజెక్టు‌కు అనుమతి ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు‌‌ అనుమతులపై అనేక అభ్యంతరాలు వచ్చాయని నిపుణుల కమిటీ తెలిపింది.

జీడబ్ల్యూడీటీ , సీడబ్ల్యూసీ సంప్రదింపులు అవసరమని కేంద్ర నిపుణుల కమిటీ వెల్లడించింది. దీంతో బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్టు అయింది. ఈ పరిణామంతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు , రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+