ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 3963 పాజిటివ్ కేసులు, 52 మంది మృతి, జిల్లాల వారీగా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు మరింతగా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా, శనివారం 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకే రోజు ఇంత ఎక్కువ మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఏపీలో ఒక్క రోజే 3963 కేసులు, 52 మంది మృతి
తాజాగా 3963 కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 589కు చేరిందని ప్రభుత్వం శనివారం బులిటెన్ విడుదల చేసింది. తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8, అనంతపురంలో 7, పశ్చిమగోదావరిలో 5, ప్రకాశంలో 4, నెల్లూరులో 3, విశాఖలో 2, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
అత్యధికంగా కర్నూలు, తూర్పుగోదావరిలో..
కాగా, రాష్ట్రంలో 22,260 యాక్టివ్ కేసులున్నాయి. 21,763 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12.84 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 5681 కరోనా కేసులు నమోదు కాగా, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో 5499 పాజిటివ్ కేసులున్నాయి.
జిల్లాల వారీగా కరోనా కేసులు..
గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 994 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 550 కేసులు, అనంతపురం జిల్లాలో 220, చిత్తూరు జిల్లాలో 343, గుంటూరులో 214, కడపలో 145, నెల్లూరులో 278, ప్రకాశం 266, శ్రీకాకుళంలో 182, విశాఖపట్నంలో 116, విజయనగరంలో 118, పశ్చిమగోదావరి జిల్లాలో 407 కేసులు నమోదయ్యాయి.
Recommended Video
దేశంలోనూ కరోనా విజృంభణ..
దేశంలోనూ
కరోనా
కేసులు
భారీగా
పెరుగుతున్నాయి.
దేశ
వ్యాప్తంగా
10,46,622
కరోనా
పాజిటివ్
కేసులు
నమోదు
కాగా,
3,63,434
యాక్టివ్
కేసులున్నాయి.
ఇక
6,56,444
మంది
కరోనా
నుంచి
కోలుకుని
ఆస్పత్రుల
నుంచి
డిశ్చార్జ్
అయ్యారు.
దేశంలో
ఇప్పటి
వరకు
26,351
మంది
కరోనాతో
మరణించారు.