ముచ్చెమటలు, బాబు ఢిల్లీ వేళ్తే: కేసిఆర్ పాలనపై బీజేపీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నెల రోజుల పాలన పైన తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష ఉప నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ నెల రోజుల పాలన తెలంగాణ ప్రజలకు ముచ్చెమటలు పట్టించిందన్నారు. అరాచకానికి, రాక్షసత్వానికి అద్దం పడుతోందని ఆరోపించారు. నాడు వైయస్ హయాంలో వక్ఫ్ భూములంటూ ఐటీ కంపెనీలను బ్లాక్ మెయిల్ చేశారని.. అదే పాత్రను ఇప్పుడు కేసీఆర్ పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
గురుకుల్ ట్రస్ట్ భూములకు సంబంధించి వేలాది పేదల జీవితాలతో చెలగాడమాడుతున్నారన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇళ్లు కూల్చివేసేందుకా అని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీలో కట్టడాలు అక్రమమని చెబుతున్న ప్రభుత్వానికి పాతబస్తీలోని అక్రమ కట్టడాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పరిపాలిస్తున్నది అధికారులా, మంత్రులా లేక ఎంస్వోలా అఏన్నారు.
టీవీ ఛానళ్ల విషయమై అధికారాన్ని శాసన సభాపతికి అప్పగించగా.. ఎంఎస్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం రాక్షస పాలనకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇక్కడ నేను.. అక్కడ జగన్ అని చెబితే దానిని రాజకీయ కోణంలో చూశామని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైయస్ హయాంలో బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు వంటి పరిస్థితులను కల్పిస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు.
మణికొండలో ఐటి కంపెనీలను వక్ఫ్ భూముల పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆ భూములు ముమ్మాటికి వక్భ్ భూములు కాదని ఓ సర్వే తేల్చిందన్నారు. వైయస్ హయాంలో దానిని టాంపరింగ్ చేశారన్నారు. ఆ భూములకు సంబంధించిన సమగ్ర ఆధారాలు బయటపెట్టాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం వద్దకు వెళ్లి పనులు చేయించుకుంటుంటే తెలంగాణ సీఎం, మంత్రులు మాత్రం నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీ
నూతన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం పనితీరు అంత బాగోలేదని బిజెపి శాసన సభా పక్ష ఉప నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బుధవారం ఆరోపించారు.

బీజేపీ
కెసిఆర్ చర్యలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ప్రభాకర్ అన్నారు. గురుకుల్ ట్రస్టు భూముల వ్యవహారం అక్రమం అని ఎపుడు నిర్ణయానికి వచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

బీజేపీ
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అవి అక్రమం కాదని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్రమమే అని కూలదోస్తోందని ప్రభాకర్ విమర్శించారు. పాతబస్తీలో ఉన్న అక్రమ కట్టడాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు.

బీజేపీ
వక్ఫ్ పేరిట మణికొండలోని నివాసులను అధికారులు బెదిరిస్తున్నారని, అధికారుల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రభాకర్ అన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications